Peerjadiguda : పీర్జాదిగూడ పెద్దచెరువు కబ్జాల కలకలం

చెరువులను మింగుతున్న అక్రమార్కులు..
హైకోర్టు ఆదేశాలతో కూడా ఆగని కబ్జాలు..
గతంలో ఎఫ్టీఎల్ లో నిర్మించిన అక్రమ నిర్మాణలు కూల్చిన ఇరిగేషన్ అధికారులు..
ఎన్నికల విధుల్లో అధికారులు.. చెరువులో చకచక అక్రమ నిర్మాణాలు...
అధికార పార్టీ అండతో చెరువును మింగి సొమ్ముచేసుకుంటున్న ప్రజా ప్రతినిధులు, నాయకులు..
పట్టించుకోని ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు..

Peerjadiguda : పీర్జాదిగూడ పెద్దచెరువు కబ్జాల కలకలం

జయభేరి, మేడిపల్లి :
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువు ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ లోపంతో చెరువు ఏఫ్టిఎల్, బఫర్ జోన్ భూమిలో అక్ర‌మ నిర్మాణాలు జోరుగా కొన‌సాగుతున్నాయి. సహజ నీటి వనరుల ఆక్రమణల వల్లే పీర్జాదిగూడ ప్రజలు బీభత్సమైన వరదల్లో చిక్కుకొవడానికి సాక్షంగా నిలిచారు. వరదల సమయంలో చెరువు సమీపంలో ప్రజలు చిక్కుకొని బిక్కుబిక్కు మంటూ గడిపిన క్షణాలను నేటికీ మర్చిపోలేక పోతున్నారు. అధికారుల ఉదాసీనత, ప్రజా ప్రతినిధులు, నాయకుల స్వార్ధం వెరిసి రోజుకింత కుచించుకుపోతుంది. చెరువులను రక్షించాల్సిన వారే భక్షనకు అధ్యం పోస్తుంటే ఇలాంటి కబ్జాలు, అక్రమ నిర్మాణాలు పునరావృత్తం అవుతూనే ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

26వ డివిజన్ శంకర్ నగర్ లో గతంలో చెరువు ఏఫ్టిఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నట్లు స్థానికులు, ప్రజా సంఘాలు, అధికారులకు ఫిర్యాదులు చేయడంతో స్పందించిన ఇరిగేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చారు. గతంలో ఇదే పెద్ద చెరువు భూమిలో కబ్జాలకు పాల్పడుతున్నట్లు తెలవడంతో వారిపై  గతంలో కేసు కూడా నమోదు చేసారు. అటు తరువాత ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంతో అక్రమార్కులు ప్రజా ప్రతినిధుల అండతో బరితెగిస్తున్నారు. అధికారపార్టీ ఉన్నాం తమకేంటి భయం అన్నట్లు ఎలాంటి జంకు బొంకు లేకుండా చెరువులను చేరబట్టెందుకు విజృంభిస్తున్నారు. రాత్రి సమయంలో మట్టి పోయిస్తూ అడ్డగోలుగా కబ్జా చేస్తూ ఇల్లు కట్టిస్తూ అమ్ముకొని సొమ్ము చేసుకుంతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చెరువు శిఖం భూమి,చెరువు భూమిలో నిర్మాణాలు చేపట్టి విక్రయిస్తున్నా  ఇరిగేషన్, రెవిన్యూ, మున్సిపల్ అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహారిస్తుండటంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read More Telangan Sand I తెలంగాణ చరిత్ర, జాతి, ఎన్నటికీ క్షమించదు... ప్రకృతి సంపదను కొల్లగొట్టిన గత ప్రభుత్వపు పాలన...

jakka3

Read More Anganwadi I అద్దె భ‌వ‌నాల్లోనే అంగ‌న్‌వాడీలు

విలేజ్ నక్ష ప్రకారం పెద్ద చెరువు విస్తీర్ణం 34.11 ఎకరాలు ఉండగా ప్రస్తుతం అక్రమార్కుల వల్ల సగం చెరువు మిగిలిందని ఇప్పటికి చర్యలు చేపట్టక పొతే ఉన్న చెరువు కూడా మిగలదంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం తీరుపై దుమ్మేత్తి పోస్తున్నారు. గత ప్రభుత్వంలో పీర్జాదిగూడ పెద్ద చెరువు సుమారు రూ.15 కోట్లతో రిటర్నింగ్ వాల్, ఆహ్లాధాకరమైన వాతావరణంతో  సుందరంగా తీర్చిదిద్ది మినీ ట్యాంక్ బండ్ మాదిరి అభివృద్ధి చేస్తే ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో అధికార పార్టీ అండతో సహజ వనరులను దోచుకోవడానికి కొందరు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు తెరలేపడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది.

Read More Telangana I రాజకీయంలో ఇవన్నీ మామూలే..

d77fc3b1-fa09-4961-b7cf-9955ee081364

Read More Telangan I తలరాత మార్చే విద్య తల వంపులు పాలవుతోందా!?

హైకోర్టు నివేదిక సమర్పించిన అధికారుల బృందం ...
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో చెరువులు కుంటలు నాలాల కబ్జాలపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటి సంరక్షణ,అభివృద్ధి, పురోగతిపై అధ్యాయనానికి డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గాడి ప్రవీణ్ కుమార్ మరియు రెవెన్యూ ప్రభుత్వ ప్లీడర్ టి శ్రీకాంత్ రెడ్డి నేతృత్వం లోని కమిటీ సభ్యుల బృందంతో కూడిన కమిటీని నియమించింది. ఈ క్రమంలోనే ఈ బృందం అన్ని ప్రాంతాలతో పాటు పీర్జాదిగూడ పెద్ద చెరువు సందర్శించి క్షేత్ర స్థాయిలో పరిశీలించి పెద్ద చెరువు సుందరీకరణ పై హర్షం వ్యక్తం చేస్తూ చెరువు యొక్క విస్తీర్ణం, ఆక్రమణలపై వివరాలు సేకరించి నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది. అధికారుల బృందం నివేదిక న్యాయస్థానంలో ఉండగానే కబ్జా దారులు బరితెగించి అక్రమనలకు పాల్పడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More Telangana I క్యాబినెట్ భేటీతో.. బీఅర్ స్ లో పెరిగిన దడ.!?

Views: 0