జాతీయ రోడ్డు భద్రత మాహోత్సవాలు
జయభేరి, సైదాపూర్ : జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు సిపి గౌస్ అలం ఆదేశాల మేరకు సైదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శనివారం ఎస్సై కొప్పుల స్వాతి ఆధ్వర్యంలో మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. వివిధ గ్రామాల సర్పంచులు మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలపై మహిళలు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. అందంగా ఆకర్షణీయంగా వేసిన ముగ్గులకు బహుమతులు ప్రకటించారు. హుజురాబాద్ రూలర్ సిఐ పులి వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో విజేతలు బహుమతులను మొదటి బహుమతి దుద్దెనపల్లి గ్రామం, రెండవ బహుమతి వెన్కేపల్లి, మూడవ బహుమతి లక్ష్మన్న పల్లి, నాలుగవ బహుమతి, సైదాపూర్, పెర్కపల్లి గ్రామం విజేతలకు బహుమతి సీఐ పులి వెంకట్ గౌడ్ అందజేశారు. ప్రతి గ్రామంలో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు.
Read More Telangana I కంచర గాడిద.. రేసుగుర్రం... సన్నాసి! దద్దమ్మలు! దున్నపోతును కొనుక్కున్నది ఎవరు?

Views: 36


