ప్రజా గాయకుడు గద్దర్.. షాద్ నగర్ లో జయంతి వేడుకలు

గద్దర్ కు నివాళులర్పించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఉద్యమకారులు

ప్రజా గాయకుడు గద్దర్.. షాద్ నగర్ లో జయంతి వేడుకలు

జయభేరి, షాద్ నగర్, జనవరి 31 : ప్రజా గాయకుడు గద్దర్ అని ఆయన ఎంతోమందిని చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గొప్ప గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ (గుమ్మడి విఠల్ రావు)  అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయం అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారులతో కలిసి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే శంకర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ... తెలంగాణకు చెందిన ప్రముఖ విప్లవ కవి, ప్రజా గాయకుడు  ఆయన తన పాటల ద్వారా సామాజిక అసమానతలను ప్రశ్నిస్తూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.

తన విలక్షణమైన శైలితో దశాబ్దాల పాటు ప్రజలను చైతన్యపరిచిన ప్రజా యుద్ధనౌకగా ఆయన గుర్తింపు  పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత తాండ్ర కాశీనాథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మాజీ జెడ్పీటీసీ వెంకట్ రాంరెడ్డి,కాంగ్రెస్ నేతలు , ఎండి.ఇబ్రహీం, బాధేపల్లి సిద్దార్థ, ఆశన్న గౌడ్, సోలిపుర్ శ్రీశైలంగౌడ్ ,ఉద్యమ కారుల వెల్ఫేర్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జేఏసీ నేతలు అర్జున్ కుమార్,  వెంకటయ్య, లింగారెడ్డి గూడ అశోక్ , రవి, తదితరులు పాల్గొన్నారు.

Read More Love : అమ్మను ప్రేమించలేనోడికి  అమ్మాయి కావాల్సొచ్చిందిరా?

Views: 3