సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన
ఉదయం వాకింగ్ చేసే ప్రజలను కలుసుకుని సూచనలు చేసిన పోలీస్ అధికారులు
జయభేరి, జగిత్యాల జిల్లా.. ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం కల్పించాలన్న జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలమేరకు జిల్లా పోలీస్ శాఖ ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించే దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇందులో బాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ఉదయం వాకింగ్ చేసే ప్రజలను కలుసుకుని, సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సైబర్ మోసల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
• అనుమానాస్పద లింక్స్పై క్లిక్ చేయరాదు,
• బ్యాంకు వివరాలు, OTP, ఆధార్, పాన్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వరాదు,
• ఏదైనా అనుమానం కలిగితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 కు కాల్ చేయాలి, లేదా
• www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Views: 4


