షాద్ నగర్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ నేతలు

సీఎం.. సీఎం అంటూ పెద్ద ఎత్తున కార్యకర్తల నినాదాలు..

బిఆర్ఎస్ కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించిన కేటీఆర్...

జన సందోహంలో కాన్వాయ్ నుండే అంజన్న ఎక్కడ అంటూ దగ్గరికి తీసుకున్న కేటీఆర్.

షాద్ నగర్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ నేతలు

జయభేరి, షాద్ నగర్, జనవరి 12 : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ బైపాస్ కేశంపేట రోడ్డులో మహబూబ్ నగర్ వెళ్తున్న  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాద్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆరు మండలాల నుండి పట్టణం నుండి ఇసుకేస్తే రాలనంత కార్యకర్తలు కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు.

ఆ ప్రాంతమంతా జనసంద్రోహంతో  మారిపోవడంతో కాన్వాయ్ నుండే కేటీఆర్ అంజన్న ఎక్కడ అంటూ దగ్గరికి తీసుకున్నారు ఇంతలోనే కార్యకర్తలు పెద్ద ఎత్తున సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా కేశంపేట మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వై.రవీందర్ యాదవ్ మాట్లాడుతూ... కేవలం ఒక్క చిన్న పాటి మెసేజ్ తోనే కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను ఎంత మేరకు మోసం చేస్తుందో అర్థమవుతుందన్నారు.

Read More Telangana MP I టార్గెట్ @17

ఇది  బహిరంగ సభ కాదన్నారు కేవలం కేటీఆర్ కి స్వాగతం పలికేందుకే ఒక్క మెసేజ్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున జనసందోహంతో నిండిపోయిందన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వచ్చే మున్సిపల్, పరిషత్, అన్ని ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అందిస్థానాలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇచ్చి గెలుపే లక్ష్యంగా పూర్తిస్థాయిలో తమ అభ్యర్థులను  గెలిపించుకుంటామని అన్నారు.

Read More Telangana I మును గో.. డౌట్..

కేటీఆర్ రాకతో షాద్ నగర్ లో కొత్త జోష్.... కేటీఆర్ బి ఆర్ ఎస్ పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ లా కాకుండా ఒక సామాన్యుడిలా అందరిని పలకరించి కొద్దిసేపు ముచ్చటించడంతో  నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని సీఎం సీఎం అని భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల ముఖ్య నాయకులు  కార్యకర్తలు  భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

Read More Telangana I గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) 42వ వన భోజన కార్యక్రమం

Views: 4