పేదల పట్ల ఒకలా ధనవంతుల పట్ల మరొకల వ్యవహరించడమేనా హైడ్రా గొప్పతనం

మూసి నదిపై నిర్మిస్తున్న భవనాలను సందర్శించిన బీఆర్ఎస్ నేతలు

సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి

పేదల పట్ల ఒకలా ధనవంతుల పట్ల మరొకల వ్యవహరించడమేనా హైడ్రా గొప్పతనం

జయభేరి, హైదరాబాద్ :
హైద‌రాబాద్‌లో హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న  అరాచ‌కాల‌ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినడమే కాకుండా,ఎంతో మంది ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇళ్లను కులగొట్టి పేద ప్రజల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. నార్సింగ్ లోని మూసినది పై నిర్మిస్తున్న భవనాలను బీఆర్ఎస్ నాయకులు  మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి,ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తదితరులు పర్యటించారు.

IMG-20251102-WA4212

Read More Telangana I చెత్త మనుషులు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదవారిపట్ల, ధనవంతులు పట్ల ఒకేలాగ వ్యవహరించాల్సిన హైడ్రా పేదవారి ఇళ్లను కులగోడుతూ, మూసీ నదిపై నిర్మిస్తున్నాన ఇలాంటి భారీ భవనాల జోలికి వెళ్లకుండా ఉండడం పట్ల ప్రభుత్వ వైఖరి అర్థమవుతుందని ఇది కేవలం పేదవారి ఇల్లు కూలగొట్టి పెద్దవాల నుండి డబ్బులు దండుకోవడానికి రేవంత్ రెడ్డి హైడ్రాను తెచ్చారని ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.

Read More Telangana | టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన యువకులు

Views: 2