గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం

వాహనాల వెంటపడి పరుగుపెట్టిస్తున్న వీధికుక్కలు... గాయాలపాలవుతున్న చిన్నారులు, వాహనదారులు

గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం

జయభేరి, మేడ్చల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వీధికుక్కలు ప్రజలను తీవ్రభయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. పగలురాత్రి తేడా లేకుండా గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, సైకిల్‌, ద్విచక్రవాహనదారులను వెంబడించి పరుగుపెట్టిస్తున్నాయి.

వీధికుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాత్రివేళల్లో రోడ్లపైకి గుంపుగుంపులుగా వచ్చి రోడ్లపై నుంచి వెళ్ళే వారిపై దాడులు చేస్తుండడంతో కుక్కలు కనబడితే చాలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం సాయంత్రం గౌడవల్లి గ్రామంలో వీధి కుక్క ఒక్కసారిగా ముగ్గురిపై విచక్షణ రహితంగా దాడి చేసింది. ఈ దాడిలో మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, బీహార్ రాష్టానికి చెందిన తల్లి కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి.

Read More Telangana I ఇది గౌడలను అవమానించడమే..!

తీవ్ర గాయాలైన బాలుడిని చికిత్స నిమిత్తం నగరంలోని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని కిరణ దుకాణానికి బీహార్ కు చెందిన మహిళ తన కుమారుడితో కలిసి వచ్చింది. ఇదే సమయంలో అటువైపు వచ్చిన వీధి కుక్క ఒక్కసారిగా ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు దాడికి పాల్పడిన కుక్కను వెంబడించి కొట్టి చంపేశారు.

Read More Telangana I గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) 42వ వన భోజన కార్యక్రమం

Views: 0