మేడిపల్లి ప్రెస్ క్లబ్ ఆవరణలో ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

మేడిపల్లి ప్రెస్ క్లబ్ ఆవరణలో ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

జయభేరి, మేడిపల్లి : సమసమాజ నిర్మాణం కోసం పాత్రికేయులుగా మన కర్తవ్యాలను ముందుకు తీసుకుపోయేందు కృషి చేయాలని మేడిపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిర్ర శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం 79 వ స్వతంత్ర దినోత్సవం వేడుకలను ప్రెస్ క్లబ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు చిర్ర శ్రీధర్ రెడ్డి జాతీయ జెండాను అవిష్కరించారు.అనంతరం ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారులు కల్కూరి ఎల్లయ్య మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మీడియా పాత్ర అమోఘమైందని పత్రిక విలువలను కాపాడేందుకు జర్నలిస్టులుగా మనం పారదర్శకంగా ఉండాలని సూచించారు.

Read More GHMC I శివ శివ.. హర హర...

ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి వడేమాను సుందర్, కోశాధికారి మరాటి మల్లేష్,ఉపాధ్యక్షుడు చింత రమేష్,సంయుక్త కార్యదర్శులు చిన్నం మధు,నిరుడు అంజన్ కుమార్,సభ్యులు ఎన్.రాము యాదవ్, వంగ శ్రీనివాస్ రెడ్డి, బూష గణేష్,శేరి కరుణాకర్ రెడ్డి,జంగా నరేందర్ యాదవ్, బైరెడ్డి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More BJP_Bandi Vs Ponnam I విజయ సంకల్ప యాత్ర ..? అసలు ఉద్దేశం ఏంటి!?

Views: 7