చైనా మాంజా పోలీసులు పంజా

చైనా మాంజా పోలీసులు పంజా

జయభేరి, మేడ్చల్ : సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు.. ఎక్కడ చూసినా ఒక సంతోషకర వాతావరణం కనిపిస్తుంటుంది. వీటిలో పంతంగులు ఎగురవేయడం ఒకటి. అయితే... ఈ పతంగులకు చైనా మాంజా వాడుతుండడం ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ మంజా చుట్టుకొని గాయపడడమేగాక ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చిన్నాపెద్దా తేడా లేకుండా పతంగులు, మాంజా, చరఖ్ లను కొనుగోలు చేస్తున్నారు.

సాధారణంగా కాటన్ తో తయారు చేసిన మాంజాను వినియోగిస్తుంటారు. కానీ ఎదుటి వారి గాలి పటాలను కట్ చేయాలనే ఉత్సాహంతో చైనా మాంజా వాడుతున్నారు. దీంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో నిషేధిత మాంజా విక్రయదారులపై పోలీసులు దృష్టి సారించారు. ప్రతి ఏటా చైనా మాంజాలతో మెడకు, కాళ్ళకు చుట్టుకుని తీవ్ర ప్రమాదాల బారిన  పడుతున్నారు. మాంజాను ఎక్కడపడితే అక్కడ రోడ్లపై పడేస్తుండటంతో వాహనాల చక్రాలకు చుట్టుకుని ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. పక్షులు సైతం ప్రాణాలు కోల్పోతుండటంతో గతంలోనే ప్రభుత్వం ఈ మాంజాను నిషేధించింది. అయినప్పటికీ అక్రమంగా విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Read More Telangana journalist | అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ

విక్రయిస్తున్నవారిపై కేసులు.. 
నిషేధిత సింథ టిక్ నైలాన్ గ్లాస్ కోటెడ్ చైనా మాంజా విక్రయాలపై మేడ్చల్ పోలీసులు దృష్టి సారించారు. మేడ్చల్, షామీర్పేట తదితర పోలీసు స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో గాలిపటాలు, మాంజా విక్రయిస్తున్న దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

Read More Telangana I రాజకీయంలో ఇవన్నీ మామూలే..

చైనా మాంజా విక్రయిస్తే చర్యలు తప్పవు: సత్యనారాయణ సీఐ, మేడ్చల్... పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మంజల విక్రయంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. బృందాలుగా ఏర్పాటు చేసి దుకాణాలలో తనిఖీలకు ఆదేశించాం. నిషేధిత మాంజాలు అమ్మకుండా దుకాణదారులకు సూచించాం.

Read More Telangana I కంచర గాడిద.. రేసుగుర్రం... సన్నాసి! దద్దమ్మలు! దున్నపోతును కొనుక్కున్నది ఎవరు?

IMG-20260112-WA1106

Read More Congress I రగులుతున్న రాజకీయం.. మంట పెట్టే వారెవరు!?

Views: 0