ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి విద్యార్థులకు అవర్ రెడ్డి ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ల పంపిణీ

ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి విద్యార్థులకు అవర్ రెడ్డి ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ల పంపిణీ

హైదరాబాద్, 31 మే 31 : అవర్ రెడ్డి ఫౌండేషన్ (ORF) ఆధ్వర్యంలో *2026-2027 విద్యా సంవత్సరానికి* గాను *విద్యా ధన్ స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమం* హోటల్ ది ప్లాజా, బేగంపేట, హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించబడింది. ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి విద్యార్థినీ, విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఉపకార వేతనాలు అందజేశారు. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం సాంకేతిక నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, సామాజిక నైపుణ్యాలపై విలువైన సలహాలు, సూచనలు అందించారు.

వ్యవస్థాపక సభ్యులు పెరియావరం గోపాల్ రెడ్డి, గుట్టికొండ శివ సుందర్ రెడ్డి, సిఎ యల్దండ కొండల్ రెడ్డి, పాలగిరి సుబ్బా రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, డా. స్వాతి రెడ్డి, డా. రజని రెడ్డి, దివాకర్ రెడ్డి, డి మధు సుధన్ రెడ్డి, రాజా మోహన్ రెడ్డి, రంగా రెడ్డి, మరియు దాతలు బి. వీరా రెడ్డి, ఎస్ఎన్ రెడ్డి, కె. అశ్విని రెడ్డి, కవిత రెడ్డి, శోభా రెడ్డి, కె. భరత్ రెడ్డి, సిఎ సురేష్ రెడ్డి, టిఎస్ రెడ్డి, పుష్ప రెడ్డి, చల్లా చైతన్య రెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగించారు. 

Read More నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేతా..

ORF చేపట్టబోయే భవిష్యత్తు కార్యక్రమాలు, విద్యార్థి సాధికారత దృష్టి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ORF వ్యవస్థాపక సభ్యులు, కమిటీ సభ్యులు, దాతలు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి ద్వారా అర్హులైన విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడమే అవర్ రెడ్డి ఫౌండేషన్ ధ్యేయం.

Read More నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి 

Views: 0