పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జయభేరి, సైదాపూర్ :
అలనాటి మధురస్మృతుల కోసం మళ్లీ ఒకరోజు శిష్యుల ఎదుగుదలే గురు దక్షిణగా భావించి పూజ్యులైన గురువుల సమక్షంలో 39 సంవత్సరాల తర్వాత అపురూప కలయిక.. కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలం, దుద్దునపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1986-–87 పదోతరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సమావేశ కర్తలు.. ఎస్ రాజయ్య, టి నారాయణ రెడ్డి. సభాధ్యక్షులు.. ఆడెపు రాజేందర్, పరకాల నారాయణ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కే శ్రీనివాస్ రెడ్డి ఎంఈఓ, సునీత PS HM హాజరైనారు.

Views: 1


