మహిళలు మౌనం వీడి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి..

ర్యాగింగ్ ఇవిటిజింగ్ ఏదైనా అవమానానికి గురి అయినట్లయితే వెంటనే జిల్లా షీటీమ్ వాట్సాప్ నెంబర్ 8712667434 కాల్ చేయాలి... మౌనం వీడితే మహిళా గెలిచినట్లే మౌనంగా ఉండి కష్టాలు కోరి తెచ్చుకోవద్దు... సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి.. పోలీస్ కమిషనర్ బి. అనురాధ

మహిళలు మౌనం వీడి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి..

జయభేరి, సిద్దిపేట :
సిద్దిపేట జిల్లాలోని షీటీమ్స్, యాంటీ హ్యూమన్  ట్రాఫికింగ్ యూనిట్స్ అధికారులు సిబ్బంది మే నెలలో 5. 2024 వివిధ ప్రదేశాలలో కాలేజీలలో  నిర్వహించిన అవేర్నెస్ కార్యక్రమాల వివరాలు.. సిద్దిపేట జిల్లాలో షీటీమ్స్ తో మహిళలకు, బాలికలకు భద్రత, భరోసా జిల్లాలోని హాట్స్పాట్ వద్ద  షీటీమ్స్ తో నిరంతరం నిఘా, ఈవెటీజర్స్ 108 మందిని పట్టుకొని కౌన్సెలింగ్  నిర్వహించడం జరిగింది. 

108 ఈ పెట్టి కేసులు, నమోదు చేయడం జరిగింది. షీటీమ్స్ బృందాలు హాట్స్పాట్ 324 సార్లు సందర్శించడం జరిగింది. షీ టీమ్స్ 11 వివిధ ప్రదేశాలలో  కాలేజీలలో అవేర్నెస్ కల్పించడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, డివిజన్లవారీగా షీటీమ్స్ పనిచేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లాలో ఉన్న షీ టీమ్స్ బృందాలు ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో,తెలంగాణ మోడల్ స్కూళ్లలో, రెసిడెన్షియల్ స్కూల్ లలో కేజీబీవీ స్కూళ్లలో విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో,షీ టీమ్స్, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది.

Read More నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి 

మహిళా పోలీస్ స్టేషన్, స్నేహిత మహిళా కౌన్సిలింగ్ సెంటర్, భరోసా సెంటర్ కు  కౌన్సిలింగ్ గురించి వచ్చే మహిళల  ఉపాధి లేనివారికి ఉపాధి కలిగించడం గురించి పోలీస్ కమిషనర్  ఆసక్తిగల 48 మంది మహిళలకు సిద్దిపేట పట్టణం కోటిలింగాల టెంపుల్ ఆవరణలో ఉన్న ఆంధ్ర బ్యాంక్ వారి యొక్క సహకారంతో నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రంలో ఎంబ్రాయిడింగ్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర వాటిపై శిక్షణ ఇప్పించడం జరుగుతుంది... పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాద

Read More వివాహ వేడుకల్లో పాల్గొన్న ఉద్యమ నాయకులు మహ్మద్ అప్జల్ ఖాన్

 ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ.. మహిళలు బాలికల రక్షణ గురించి  తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా షీటీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల, బాలబాలికల, విద్యార్థిని, విద్యార్థులకు, రక్షణగా నిలుస్తూ సేవలు అందించడం జరుగుతుంది, ఏదైనా ఫోన్ వస్తే వెంటనే సంఘటన స్థలానికి చేయుచున్నారు. గుర్తించిన హాట్స్పాట్ వద్ద మరింత నిఘా ఉంచడం జరుగుతుంది. హాట్స్పాట్స్ ప్రదేశాలలో సీసీ కెమెరాలు పనితీరును  ఎప్పటికప్పుడు సమీక్షించాలని, పనిచేయకపోతే వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు రిపేర్ చేయాలని సూచించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. 

Read More ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు

మహిళలు బాలికలు విద్యార్థినిలు షీటీమ్స్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో డయల్-100కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు. ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100 లేదా షీటీమ్ వాట్సప్ నెంబర్ 8712667434. సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్  8712667100 ఫోన్ చేయాలని సూచించారు. ఫోక్సో, లైంగిక వేధింపుల గురైన మహిళలకు బాలికలకు భరోసానిస్తున్న భరోసా సెంటర్, మహిళలకు అండగా స్నేహిత మహిళా సపోర్ట్  సెంటర్ సేవలు. లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కల్పిండంతో పాటు, వారికి  భరోసా కేంద్రం, స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్  పూర్తి సహయ సహకారాలను అందిస్తుంది.

Read More కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం

బాధితుల్లో భరోసాను కలిగిస్తున్న సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ భరోసా కేంద్రం, లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కల్పిండంతో పాటు వారికి  పూర్తి సహయ సహకారాలను అందిస్తుంది తెలిపారు, భరోసా సెంటర్ ద్వారా సత్వర సేవలు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎక్కడైనా పోక్సో, అత్యాచారం కేసులు జరగగానే సంబంధిత బాధితులను నేరుగా భరోసా సెంటర్ కు సంబంధిత అధికారులు తీసుకొని రాగానే చట్ట ప్రకారం వారికి అందించవలసిన సేవలు అందించడం జరుగుతుందన్నారు. భరోసా సెంటర్ సేవల గురించి సంబంధిత బాధితులు  భరోసా సెంటర్ నెంబర్ 08457-293098, డయల్ 100, నెంబర్ కు ఫోన్ చేసి సహాయ సహకారాలు పొందవచ్చని సూచించారు.

Read More దండోరా దళపతి పాట ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ

భరోసా కేంద్రంలో మహిళలకు పిల్లలకు భరోసా ఇచ్చిన కేసుల వివరాలు ఫోక్సో కేసులు 196... రేప్ కేసులు 45... మిస్సింగ్ కేసులు 09... మొత్తం 186 మంది  బాధితులకు భరోసా కల్పించడం జరిగింది. భరోసా సెంటర్ సిబ్బంది 86 మంది బాధితుల ఇండ్లను సందర్శించడం జరిగింది, 22 మందిని రియాబిటేషన్ సెంటర్ కు పంపించడం జరిగింది. గ్రామాలలో పట్టణాలలో భరోసా సెంటర్ అందిస్తున్న సేవల గురించి 90 అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భరోసా సెంటర్ ఫండ్ నుండి బాధితులకు 96,300 ఆర్థిక సాయం అందించడం జరిగింది. 2015 ఈరోజు వరకు బాధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి 254 మంది మహిళలకు 87,27,500 ఆర్థిక సాయం అందించడం జరిగింది. ప్రాసిక్యూషన్ సమయంలో కూడా  బాధితులకు న్యాయపరమైన సలహాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

Read More నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేతా..

స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్లో, గృహహింసకు వివిధ వేధింపులకు గురి అవుతున్న మహిళలు సంబంధించిన దరఖాస్తులు 996 వాటిలో నుండి  భార్యాభర్తలను, కుటుంబ సభ్యులను పిలిపించి 967  కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది. ఎవరైనా మహిళలు గృహహింసకు, కట్నం తదితర అంశాల గురించి వేధింపులకు గురి చేస్తే  వెంటనే స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్ 9494639498 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలని మహిళలకు సూచించారు.

Read More ఘనంగా డాక్టర్ వేణుధ రెడ్డి జన్మదిన వేడుకలు