ధరణితో పరిష్కారం కానీ సమస్యలు భూ భారతి తో చెక్...

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్..

ధరణితో పరిష్కారం కానీ సమస్యలు భూ భారతి తో చెక్...

జయభేరి, కుకునూర్ పల్లి, ఏప్రిల్ 26 :
ధరణితో పరిష్కారం కాని సమస్యలు భూభారతితో పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ మనుచౌదరి పేర్కొన్నారు. శనివారం కొండ పాక, కుకునూరుపల్లి మండలాల్లోని రైతు వేది కల్లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భా సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. 

రైతుల తమ భూములపై పక్కాగా హక్కులు కలిగి ఉండేలా భూ భారతి చట్టం పని చేస్తుంద న్నారు. గతంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వం భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసకు నేలా ఈ చట్టంలో అవకాశాలు ఉన్నాయ న్నారు. ఇదివరకు భూ సమస్యల పరిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిరుగాల్సి వచ్చేదని, భూ భారతితో పారదర్శకంగా విచారణ జరిపి జిల్లా, రెవెన్యూ అధికారులు పరిష్కరించే అధి కారులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అవ కాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకు ముందు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ భూభారతి చట్టంపై అవగా హన కల్పించారు. కార్యక్రమంలో ఆర్డీఓ చం ద్రకళ, డీసీఓ నాగమణి, మార్కెట్ కమిటీ చైర్మన్ వి.శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్లు దిలీప్ నాయక్, సుజాత, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఏఓలు శివరామకృష్ణ, గోవిందరాజు తదిత రులు పాల్గొన్నారు.

Read More హరీష్ రావు పై అక్రమ కేసులు తగవు