అన్నను హతమార్చిన తమ్ముడు

మేడ్చల్ నడిరోడ్డుపై దారుణంగా హత్య.. నిందితుల కోసం గలిస్తున్న పోలీసులు

అన్నను హతమార్చిన తమ్ముడు

జయభేరి, మేడ్చల్ : కుటుంబ కలహాలతో అన్నను తమ్ముడు హతమార్చిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి ప్రాంతానికి చెందిన గన్యా మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం నిమిత్తం గన్యా కుటుంబంతో సహా  మేడ్చల్ కు వచ్చి నివాసం ఉంటున్నాడు. ఇతడికి ముగ్గురు కుమారులు,ఓ కూతురు సంతానం కాగా హత్యకు గురైన వ్యక్తి ఉమేష్ మొదటి కుమారుడు.

Read More Telangana MP I టార్గెట్ @17

ఉమేష్ మద్యానికి బానిసగా మరి కుటుంబ సభ్యులను తరుచు వేదిస్తూ గొడవలు చేస్తుండటంతో ఉమేష్ ఆగడాలను భరించలేక రెండవ కుమారుడు రాకేష్ మరియు అతని మరో సోదరుడు లక్ష్మణ్ తో కలిసి ఉమేష్ ను మేడ్చల్ జాతీయ రహదారిపై పట్టపగలే కత్తులతో దారుణంగా దాడిచేసి  హత్య చేసినట్టు మేడ్చల్ ఏసీపీ తెలిపారు. హత్యకు పాల్పడిన రాకేష్, లక్ష్మణ్ లు పరారీలో ఉన్నారని ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుల కోసం గాలింపు చేస్తున్నామని త్వరలోనే నిందితులను పట్టుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Read More Telangana I చెత్త మనుషులు

IMG-20250216-WA4391

Read More College I సాంకేతికతతో భోధన చేయాలి

Views: 0