అనుమానాస్పద స్థితిలో ఉ*రి వేసుకుని వ్యక్తి ఆత్మ*హ*త్య
ఆర్థిక సమస్యలే కారణమని పోలీసుల అనుమానం..
జయభేరి, శామీర్ పేట్, జూన్ 28 :
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉ*రి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన అప్సర్ ఆలం (36) బ్రతుకు దెరువు కోసం మూడుచింతలపల్లి కి వచ్చి పాన్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతని భార్య సైదా డెలివరీ కోసం పశ్చిమ బెంగాల్ కు వెళ్లింది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆలం చీరతో స్లాబ్ కు ఉరివేసుకుని ఆత్మహ*త్యకు పాల్పడ్డాడు.
Views: 0


