తోషిబా కంపెనీ భూమి పూజ కార్యక్రమం

మంత్రులు డా. వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు...

తోషిబా కంపెనీ భూమి పూజ కార్యక్రమం

జయభేరి, రూద్రారం, సంగారెడ్డి జిల్లా : తోషిబా కంపెనీ విస్తరణలో భాగంగా 562 కోట్లతో నూతన యూనిట్లకు భూమి పూజ చేసిన మంత్రులు డా. వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు. 

సంగారెడ్డి జిల్లా రూద్రారంలో ఉన్న తోషిబా కంపెనీ విస్తరణలో భాగంగా రూ. 562 కోట్లతో నిర్మించనున్న నూతన తయారీ యూనిట్లకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని పూజలు నిర్వహించారు.

Read More ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో ఎమెర్జెన్సీ

IMG-20250808-WA3706

Read More హెచ్‌ఐవీకి ఇంజెక్షన్‌ వచ్చేసింది

ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ... “ఈ విస్తరణతో స్థానిక యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రాంతానికి పారిశ్రామిక అభివృద్ధి, మరిన్ని పెట్టుబడులకు దారితీయనున్నాయని” పేర్కొన్నారు.భ విష్యత్తులో మరిన్ని మల్టీ-నేషనల్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఇదొక మార్గదర్శకం అవుతుందన్నారు.

Read More అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్ల పెంపునకు కత్తెర

IMG-20250808-WA3707

Read More USA లో ఇద్దరు తెలుగు అమ్మాయిలు shoplifting చేశారట, కెనడా పోలీసుల అరెస్టు చేశారు.

Views: 1