ఘనంగా కుమ్మరుల శ్రావణ మాస తొలి బోనాల జాతర

ఘనంగా కుమ్మరుల శ్రావణ మాస తొలి బోనాల జాతర

జయభేరి, దేవరకొండ : నల్గొండ జిల్లా ధర్వేశిపురం శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వద్ద ఆదివారం కుమ్మరుల శ్రావణమాస తొలి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కుమ్మర శాలివాహన సంఘం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కుమ్మరుల తొలి బోనాల జాతర కమిటీ అధ్యక్షురాలు ఏడుకొండల సత్యవతి వెంకటేశ్వర్లు మరియు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

 ఈ కార్యక్రమానికి దేవరకొండ నియోజకవర్గం కుమ్మర శాలివాహన సంగం అధ్యక్షులు తోటపల్లి కిరణ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పాల్గొన్నారు. మహిళలు బోనాలు ఎత్తి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బోనం అమ్మవారికి సమర్పించారు. పోతరాజుల నృత్యం భారీ ర్యాలీ చూపరులను కనువిందు  చేసింది అనంతరం కుమ్మరుల శ్రావణ మాస  తొలి బోనాల కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవరకొండ నియోజకవర్గం నుండి ఈ కార్యక్రమంలో కుమ్మరులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో నిర్వాహకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Read More Telangana I మును గో.. డౌట్..

ఈ సందర్భంగా తోటపల్లి కిరణ్ మాట్లాడుతూ కుమ్మరులు ఐక్యంగా ఉండాలని, గ్రామ దేవతల వద్ద కుమ్మరులను పూజారులుగా  నియమించాలని, రాజకీయంలో చొరవచూపి ఉన్నత పదవులను అధిరోహించాలని సూచించారు.

Read More Telangana I పదవి అమ్మది.. పెత్తనం కొడుకుది...

IMG_20250728_112038

Read More Election I పార్టీల మేనిఫెస్టోల మతలబు ఏమిటి?

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు తోటపల్లి కిరణ్,నీలకంఠం రాములు, కాసర్ల వెంకటేశ్వర్లు, మాడుగుల యాదగిరి, ఘనపురం వెంకటేశ్వర్లు, తోటపల్లి వెంకటయ్య, బొడ్డుపల్లి మల్లేశం, ఏరుకొండ రాము, తోటపల్లి శ్రీనివాస్,డాక్టర్ శ్రీను,బొడ్డుపల్లి బాలకృష్ణ,ఏరుకొండ నరేష్,ఏరుకొండ వెంకటయ్య, లక్ష్మీ, ఈశ్వరమ్మ,తోటపల్లి వెంకటేష్ తోటపల్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Read More Telangana I జంప్ జిలానీల తో ఎల్బీనగర్ తికమక

Views: 0