ఏకరూప క్రీడా దుస్తులు, ఐడీ కార్డ్స్ పంపిణీ
సైదాపూర్ మండలంలోని ఏక్లాస్పూర్ గ్రామంలో కీర్తిశేషులు కొత్త పద్మనాభ రెడ్డి జ్ఞాపకార్ధంగా వారి కుమారులు శ్రీ.కొత్త నారాయణ రెడ్డి మాజీ సర్పంచ్ కొత్త రాజిరెడ్డి, కొత్త నాగిరెడ్డి, ప్యాక్స్ చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప క్రీడా దుస్తులు, ఐడీ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని సైదాపూర్ మండల AMC చైర్మన్ దొంత సుధాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు పంపిణీ చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకుని సమాజంలో గుర్తింపు పొందాలని పాఠశాల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తామని విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.. ఇంత మంచి గొప్ప కార్యక్రమానికి చేయూతనిస్తున్న కొత్త పద్మనాభ రెడ్డి కుమారులని సన్మానించి వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు.



