బూర్గుల గ్రామాన్ని సందర్శించిన కెవిపిఎస్ జిల్లా బృందం
దళితుల ఇళ్లకు అడ్డంగా ఉన్న కంచె తొలగించిన నాయకులు
జయభేరి షాద్ నగర్ ఆగస్టు 05 : దళితుల ఇండ్లకు అడ్డంగా వేసిన కంచను పరిశీలించిన కెవిపిఎస్ నాయకులు, దళిత సంఘలు, సామాజిక సంఘాల నాయకులు రాజకీయ పార్టీ నాయకులు సందర్శించి అడ్డుగా ఉన్న కంచెను తొలగించారు.
మానవత దృక్పథంతో బూర్గుల సుమన చెప్పడం చాలా సంతోషకరం అన్నారు. దళిత బస్తికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో ఉద్యానవనం పార్కు నిర్మిస్తామని చెప్పారు నాయకులు కేవిపిఎస్ నాయకులు ఉద్యానవనం సంబంధించిన చెట్లను ఫారెస్ట్ డిఆర్డిఏ అధికారులతో మాట్లాడి గ్రామానికి పంపుతామని అన్నారు. కంచె స్థలంలో ఉద్యానవనము ఏర్పాటు పట్ల గ్రామానికి చెందిన ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే బూర్గుల సుమనా లాగా సహోదయంతో సమస్యలను పరిష్కరించుకోవాలని పదిమందికి మేలు చేసే విధంగా మనం చూసే పనులు ఉండాలని కెవిపిఎస్ నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య, ఎం. అశోక్ ,సిఐటియు నాయకులు రాజు, శ్రీను, దళిత సంఘాల నాయకులు, ఎస్ఎఫ్ఐ శ్రీకాంత్, టిడిపి మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, సరూర్నగర్ మండల వైస్ ఎంపీపీ మౌనిక, హరి కృష్ణ గౌడ్, గ్రామస్తులు రామకృష్ణ ,శివకుమార్, నరసింహులు, సురేష్,సాయి శంకర్ ,శ్రీహరి, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


