Telangana I చెత్త మనుషులు

నిత్యం లక్షలాది టన్నుల చెత్త భాగ్యనగరం నుంచి ఊరు బయటకు వెళ్తోంది. నిజానికి చెత్త మనుషులు ఎవరు!? చెత్తను తయారు చేసే మనమ !? చెత్తను తీసుకువెళ్లే వాళ్ళ!? ఉదయాన్నే విజిల్ ఊదుకుంటూ వచ్చే మనసున్న మనుషులపై జయ భేరి ప్రత్యేక కథనం

Telangana I చెత్త మనుషులు

జయభేరి, హైద‌రాబాద్ : అయ్యవారి జీతం అమ్మవారి పసుపు కొమ్ములకే సరిపోయింది అన్నట్టుగా చెత్త సేకరణ చేసే జీవితాలు కష్టాలు కన్నీళ్లు వంతే అయిపోతుంది... హైదరాబాద్ అంటేనే కనీసం కనికరం లేని మనుషులు ఇక్కడ మనకు నిత్యం తారస పడుతుంటారు. అలా అని అందరిని కలుపుకుపోతే సరికాదు ఎక్కువ శాతం ఇలాంటి వారే మనకు కనిపిస్తుంతుంటారు. ఇక గల్లి గల్లి తిరుగుతూ హైదరాబాద్ నగరంలో పొద్దున్నే గట్టిగా విజిల్ ఊదుకుంటూ వచ్చే సత్తా సేకరణ మనిషి నీ కదిలిస్తే కష్టాలు కన్నీళ్లే తన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కరోజు రాకపోతే ప్రతి ఇంటిలో చెత్త ఒక డంపు యాడ్ గా మారిపోయే ఈ భాగ్య నగరంలో చెత్త సేకరణ చేసే కుటుంబాలు ఇంకా దారిద్యరేఖన జీవితాలు వెల్లదీసుకుంటున్నారు. హైదరాబాదులో చెత్త సేకరణ చేసే వాళ్లు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన వాళ్లే ఈ పనికి తలవంచి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకొచ్చింది అని అంటే మేం చేసిన సర్వేలో ఎక్కువ శాతం అనగా నూటికి నూరు శాతం ఈ కులాల వాళ్లే ఈ వృత్తిని ఎంచుకోవడం గమనార్హం. ఆర్థికంగా సామాజికంగా ఇంకా చీదరించుకునే ఈ సమాజంలో ఇలాంటి పని కాక ఇంకా వారికి ఏం పని దొరుకుతుంది అనే విధంగా వాళ్లు ఈ వృత్తిని ఎంచుకోవడం వెనక ఉన్న వాళ్ళ స్థితిగతులను పరిశీలిస్తే కంట్లో కన్నీళ్లు ఆగవు..

రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని ఆశపడ్డ తెలంగాణ ప్రజానీకానికి ఇప్పుడు డబ్బే కరువైపోయి తక్కువ జీతానికి తమ జీవితాన్ని చెత్త మోసుకెళ్ళే మనుషులుగా తీర్చిన ఘనత ఈ ప్రభుత్వానికి చెందుతోంది. ఎందుకంటే స్వయం ఉపాధి అనే నిపంతో వీరికి ఒక లక్ష రూపాయల డౌన్ పేమెంట్ చేస్తూ గతంలో చెత్త మోసుకెళ్ళే వాహనాలను వీరికి అందించింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో అలా వాహనాలు తెచ్చుకున్న వాళ్ళు సబ్సిడీ పొందుతూ చెత్త సేకరణ చేసే క్రమంలో ప్లాస్టిక్ను కవర్స్ ను ఇలా ఆదాయాన్ని వనగూర్చే కొన్ని కొన్ని వాటిని పక్కకు వేసుకొని కొంత ఆదాయాన్ని గడించి కుటుంబాన్ని సాఫీగా నడుపుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్లకి రామ్ కి సమస్త తీసుకొని వీరిని పని మనుషుల కంటే హీనంగా చూస్తుండడం సమంజసం కాదని వాళ్లు ఆవేదన చెందుతున్నారు. వారంతన్లు ఏ ఒక్కరోజు సెలవు లేకుండా ప్రతి రోజూ చెత్త సేకరణకు పొద్దున్నే ఆయా కుటుంబాలు చెత్త సేకరణ బండిమీద పనికి ఎక్కాల్సిందే. జ్వరం వచ్చిన ఒళ్ళు నొప్పులు అయినా ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టే ఛాన్సే వీరికి లేదు. అలా డుమ్మా కొడితే వీరి పైన ఒక సూపర్వైజర్ ఉంటాడు. అతడు వారిపై అధికారులకి కంప్లైంట్ చేసే అవకాశం లేకపోలేదు.

Read More తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల యందు అసెస్ మెంట్ అక్రీడిటేషన్ కౌన్సిల్ (న్యాక్ )సందర్శన

గతంలో వీరికి చెత్త సేకరణకు ప్రభుత్వం అందించిన వెహికల్స్ చాలా ఈజీగా చెత్తను వేయడానికి ఉండేవి. కానీ ఇప్పుడు రాంకీ సంస్థ తీసుకున్న తరువాత చెత్త సేకరించే వెహికల్స్ కి పెద్ద డబ్బా పెట్టి వాటిని మూసి వేసే విధంగా చెత్త సేకరణల బండ్లను తయారు చేశారు. అయితే ఈ వెహికల్స్ పై చెత్తను వేయడానికి చాలా కష్టపడి పైన వేయాల్సి వస్తుందని వాపోతున్నారు గల్లి గల్లి తిరుగుతూ చెత్త సేకరించే ఆయా కుటుంబాలు.. ఆయా కుటుంబాలు తన భార్య కొడుకులు తను అందరూ కలిస్తేనే పూట గడుస్తుందని కన్నీటి పర్యంతమవుతున్నారు. కర్మ కాళీ చెత్త సేకరించే కుటుంబాల్లో ఎవరికైనా జ్వరము ఒళ్ళు నొప్పులు వస్తే భారమంతా మిగతా వ్యక్తులపై పడటం అలవాటుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి వారాంతంలో ఒక్కరోజైనా సెలవు కావాలని ప్రాధేయపడుతున్నారు. అంతేకాదు గతంలో చెత్త సేకరించే బండ్లు చాలా వెడల్పుగా ఉండేవని, రెండు మార్లు డంప్యాడ్ లో వేసేస్తే ఆ రోజుకు పని పూర్తి అయ్యేదని కానీ ఇప్పుడు ఇచ్చిన చెత్త సేకరణ బండ్లు వల్ల నాలుగు ఐదు సార్లు డంప్ యాడ్లకు వెళ్లి రావలసి వస్తుందని దీని ద్వారా డీజిల్ ఖర్చు విపరీతంగా భారం పడుతుందని దిగులు చెందుతూ ప్రాధేయ పడుతున్నారు. వారి కష్టాలు కన్నీళ్లు జయభేరి న్యూస్ కు వివరిస్తూ మాకు ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని కోరుతున్నారు.

Read More శాయంపేట బిజేపి మండల అధ్యక్షునిగా నరహరిశెట్టి రామకృష్ణ

ఇక ఇదిలా ఉంటే చెత్తను తయారు చేస్తూ ఇంట్లో మనం చేసే ఈ పనిని కాస్త జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. ఒక రోజులో కనీసం మనం చెత్తను వేయడం తగ్గిస్తూ అవసరానికి సరిపడా ఆహార పదార్థాలను తయారుచేసుకొని తద్వారా ఎక్కువ చెత్తను వేయకుండా ఉంటే మనం కూడా వారికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అవసరానికి మించి వండుకోవడం తినకుండా వాటిని పాడు చేయడం వెంటనే చెత్త డబ్బాలో వేయడం ఇలా చేయడం వల్ల మన ఇల్లే ఒక చెత్త డంప్ యాడ్ గా మారిపోతుంది. దీని ద్వారా మనము అనారోగ్యం పాలవుతూ చెత్త సేకరణ చేసే వాళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాళ్ళం కూడా అవుతాం.. మారుతున్న కాలానికి తగ్గట్టుగానే మన ఆలోచనలను అలవాట్లను మార్చుకునే మనం చెత్తను పోగు చేసే విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడదాం. చెత్త మనుషులం మనమే కాస్త జాగ్రత్త పడదాం...

Read More వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

... కడారి శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్

Read More డిఈవోను కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి