ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం
PRTUTS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి
జయభేరి, సైదాపూర్ :
17 ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థి, పిఆర్టిటిఎస్ కరీంనగర్ ఉపాధ్యాయ శాసనమండలి అధికారిక అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి ఉదయం 11 గంటలకు స్థానిక పద్మనాయక ఫంక్షన్ హాల్ నుండి సుమారు 2000 మందితో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. తదనంతరం హాజరైన ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
మాజీ కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ భట్టాపురం మోహన్ రెడ్డి మాట్లాడుతూ... సుమారు ఆరు పిఆర్సిలలో ఉద్యోగ ఉపాధ్యాయులకు మెరుగైన పిఆర్సి ఇప్పించి, వందల జీవోలు ఉపాధ్యాయుల ఒడిలో పోసిన సంఘం పిఆర్టియు అని, బతకలేక బడిపంతులు నుండి బతక నేర్పిన గురువుగా తీర్చిదిద్దిన చరిత్ర PRTU సంఘం ది అన్నారు. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా 20,000 పైగా పదోన్నతులు, 35,000 బదిలీలు, మోడల్ స్కూల్, కేజీబివీలకు బదిలీలు కల్పించిన సంఘం పిఆర్టియు అని తెలిపారు.
PRTUTS కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... నన్ను గెలిపిస్తే ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోనని ఉపాధ్యాయుల సమస్యల కొరకు పోట్లాడుతానని కౌన్సిల్ సాక్షిగా మీ గొంతుకనవుతానని తెలియజేశారు. ఉద్యోగ విరమణకు ముందు అనేక సేవా కార్యక్రమాలు చేశానని ఉద్యోగ విరమణ తర్వాత కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానని రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ ఫండ్ అంతా కూడా ప్రభుత్వ పాఠశాలల కు కేటాయిస్తానని వారి జీవితాలు మెరుగు కొరకు అహరహరం కృషి చేస్తానని, ఎల్లవేళలాఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటానని కార్పొరేట్ ని గెలిపిస్తే వారు బాగుపడతారు తప్ప ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఏ మాత్రం పనిచేయరు అన్నారు.
ఉపాధ్యాయుల సమస్య ల పై పూర్తి అవగాహన ఉన్న నన్ను గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యలపై కొట్లాడుతానని కాబట్టి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ సమావేశానికి 33 జిల్లాల PRTUTS అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు, మహేందర్ రెడ్డికి మద్దతు ఇస్తున్న 17 సోదర సంఘ రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు పాల్గొన్నారు.
Post Comment