అత్తాపూర్ లో జరిగిన జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సత్తా చాటిన మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు  

అత్తాపూర్ లో జరిగిన జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సత్తా చాటిన మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు  

జయభేరి, రాజేంద్రనగర్ : వుడ్ షాట్  బ్యాడ్మింటన్ అకాడమీ అత్తాపూర్ లో జరిగిన జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో అండర్9 గర్ల్స్ సింగిల్స్ విభాగంలో చెలూరి శాన్వీ  అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది..

 ఫైనల్ మాచ్ లో ప్రియా  మీద 21/19  స్కోర్ తో పోరాడి  గెలిచింది మరియు యు11 గర్ల్స్ సింగిల్స్ విభాగంలో తమ మ్యాచ్ పాయింట్ క్రీడాకారిని సహస్ర మీద పోరాడి 22/17  స్కోర్  తో సెమీ ఫైనల్ లో ఓడిపోయి ఫైనల్ లో పాల్గొనే అవకాశం చేజార్చుకుంది... యు11 గర్ల్స్ సింగిల్స్ ఫైనల్స్ 22/12 స్కోర్ తో సహస్ర గెలిచి గోల్డ్ మెడల్ సాధించింది... యు11 బాయ్స్ సింగిల్స్  సజయ్ తేరుపల్లి అద్భుతమైన ఆటతో సెమి ఫైనల్లో 24/22 స్కోర్ తో గెలిచి ఫైనల్ చేరుకుని ఫైనల్లో తనీష్ మీద 21/19 స్కోర్ తో గెలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. యు11 బాయ్స్ డబుల్స్ విభాగంలో సజయ్ తెరుపల్లి, శ్రీలికిత్ జోడి ఫైనల్లో 22/20 తో పోరాడి ఓడిపోయారు. సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు..

Read More ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

ఈ సందర్భంగా విజేతలకు   ట్రోఫీ, సర్టిఫికెట్ లు బహుకరించారు. ఈ సందర్భంగా శాన్వి చెలూరి, సహస్ర ,సజయ్ తేరుపల్లి శ్రీలికిత్ ని  మ్యాచ్ పాయింట్  చైర్మన్, హెడ్ కోచ్ వేణు ముప్పాల భవిష్యత్తు లో ఇంకా ఎన్నో  విజయాలు సాధించాలి అని  ఆశీర్వదించారు... వేణు ముప్పాల మాట్లాడుతూ  బ్యాడ్మింటన్ లో  అమ్మాయిలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వాళ్ళకి సరైన కోచింగ్ ప్రోత్సాహం ఇవ్వాలి అని సూచించారు. రోజు కి 6 నుండి 8 గంటలు ప్రాక్టీస్ చేస్తూ సరైన పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు..అప్పుడే మనకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయని దానికి ఉదాహరణ మ్యాచ్ పాయింట్ క్రీడాకారులే అని తెలిపారు...

Read More వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

ప్రొఫెషనల్ గా మీ పిల్లలు బ్యాడ్మింటన్ నేర్చుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడెమీ లో మీ పిల్లలను పంపించండి అని కోరారు. నిష్ణాతులైన కోచ్ లు ఉన్నారని అందరూ కూడా  ఎన్.ఐ.ఎస్  చేసిన వాళ్ళు, మంచి అనుభవం ఉన్న కోచింగ్ టీమ్ మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడెమీ లో ఉన్నారని తెలిపారు..ఈ కార్యక్రమంలో నేషనల్ ప్లేయర్ కరీమ్,మంజుల, అంతర్జాతీయ క్రీడాకారుడు లింగేశ్వర రావు  పాల్గొన్నారు.

Read More క్షయ వ్యాధి పట్ల  అప్రమత్తంగా ఉండాలి.