ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా డివిజన్లో పాదయాత్ర.
మేయర్ జక్క వెంకట్ రెడ్డి
జయభేరి, మేడిపల్లి :
నగరంలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి కృషిచేస్తూ, ఆదర్శంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉంటూ… వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు.
కాలనీల్లో నెలకొన్న సిసిరోడ్డు నిర్మాణం, మంచి నీటి సరఫరా కొరకు పాత పైప్ లైన్ ఉండటంవల్ల తరచూ లీకులతో నీటి వృధా, సరిపడా నీరు అందడం లేదని కాలనీ వాసులు తెలపడంతో నూతన పైప్ లైన్ నిర్మాణం కొరకు జలమండలి అధికారులకు విజ్ఞప్తి చేయడంతో పాటు భవిష్యత్ అవసరాల దృశ్యా గతంలో ఉన్న 40 లక్షల లీటర్ల సామర్ధ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్, రిజర్వాయర్లకు అదనంగా మరో 90 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు నిర్మాణం చేయడం జరిగిందని వీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడంతో నగర ప్రజలకు మంచి నీటి సమస్య ఉండదని పేర్కొన్నారు.

విద్యుత్ స్తంబాలు పక్కకు ఒరగడంతో విద్యుత్ తీగలు క్రిందకు వేలాడుతూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో వాటికి తక్షణమే సరిచేయాలనీ అధికారులకు సూచించారు. సమస్యలు తెలుసుకోవడం, ప్రజల బాధలు వింటూ, తక్షణ పరిష్కార చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ కౌడే పోచయ్య, పార్టీ అధ్యక్షులు బండారి రవీందర్, ఏనుగు మనోరంజన్ రెడ్డి,చిర్ర సంతోష్, సత్యం,సంజీవ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


