నూతన టిపిసిసి చీఫ్ నియామకం సరైనది, సముచిత మైనది: డాక్టర్ . యం ఏ జమాన్

నూతన టిపిసిసి చీఫ్ నియామకం సరైనది, సముచిత మైనది: డాక్టర్ . యం ఏ జమాన్

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, తెలంగాణకు చెందిన ఎన్నారై సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్‌  పత్రికా ప్రకట న లో మహేష్ కుమార్ గౌడ్ బొమ్మ ను టి పీసీసీ అధ్యక్షుడిగా  ఎంపికైనందుకు అభినందించారు.

ఆల్ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) శుక్రవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడిగా బి. మహేష్ కుమార్ గౌడ్‌ను నియమించింది.  ఆగస్ట్ 6, 2024 శుక్రవారం నాడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి  కె సి వేణుగోపాల్ ప్రకటన వెలువడిన వెంటనే డా. జమాన్ హర్షం వ్యక్తం చేశారు.టీపీసీసీ చీఫ్‌గా బి సి కమ్యూనిటీని ఎంచుకోవడానికి హైకమాండ్ తెలివైన నిర్ణయం తీసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బి.మహేష్ కుమార్ గౌడ్ చాలా కష్టపడ్డారని డాక్టర్  ఎం ఎజమాన్ వ్యాఖ్యానించారు,

Read More BRS I ఎల్బీనగర్ గడ్డ.. ఎవరి అడ్డ!?

అతని ట్రాక్ రికార్డ్ యన్ యస్ యు ఐ నుండి  యంయల్ సీ నుండి  టి పి సి సి వరకు.. చీఫ్ వరకు ఆయన ప్రస్థానం.. అద్భుతమైనది అని కొనియాడారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త హైకమాండ్ నిర్ణయాలకు ఎప్పుడూ కట్టుబడి ఉండేవారు అని డా. జమాన్  పేర్కొన్నారు. పార్టీకి ఆయన అత్యంత ప్రాధాన్యత గల పదవీ కి.  సరైన వ్యక్తికి పిసిసి చీఫ్‌ని పార్టీ గుర్తించిందని డాక్టర్ ఎం.ఎ.జమాన్ అన్నారు. 

Read More Modi I అక్టోబరు 2న రాష్ట్రానికి మోడీ

 2024 జనవరి 22న ఎమ్మెల్యే కోటా కింద తెలంగాణ శాసన మండలి సభ్యునిగా గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా కొనసాగుతున్నారని  ప్రశంసించారు, పదవీ విరమణ చేస్తున్న పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సహకారాన్ని పార్టీ అభినందిస్తుందని ఎం.ఎ.జమాన్ అన్నారు. 

Read More GHMC I శివ శివ.. హర హర...

మహేశ్ కుమార్ గౌడ్  చైతన్యవంతమైన, నాయకత్వంలో పార్టీ స్కై రాకెట్ స్పీడ్‌ తో బలోపేతం చేస్తారని ఈ పత్రికా ప్రకటనలో విశ్వాసాన్ని  డాక్టర్ ఎం.ఎ.జమాన్ వ్యక్తం చేశారు. 2028 ఎన్నికల్లో కూడా బి. మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేస్తుంది అని డా క్టర్ యం ఏ జమాన్ ఆత్మవిశ్వాసాన్ని చాటారు.

Read More Election Bonds I సుప్రీం ఆదేశం.. ఎన్నికల బాండ్లు బయట పెట్టాల్సిందే..

ఈ సందర్భగా పత్రికా ప్రకటనలో కాంగ్రెస్ హైకమాండ్, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు .జాతీయ ప్రధాన కార్యదర్శి  వేణు గోపాల్, ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి, డా.ఎం.ఎ.జమాన్ చాలా కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ సామాజిక న్యాయం విషయంలో ఎప్పుడూ ముందుంటుందని అని అన్నారు.

Read More SBI | రమేష్ మృతి తీరని లోటు   

Views: 1