Farmers : రైతులకు మద్దతు ధర దక్కడంలేదు

ఈ ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇవ్వక పోగా మద్దతు ధర కూడా దక్కనివ్వడం లేదు. రైతులు క్వింటాల్ కు 1500 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు.

Farmers : రైతులకు మద్దతు ధర దక్కడంలేదు

జయభేరి, హైదరాబాద్ :
ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ రెడ్డి మీడియతో మాట్లాడారు.
ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యానికి ఈ ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇవ్వక పోగా మద్దతు ధర కూడా దక్కనివ్వడం లేదు. రైతులు క్వింటాల్ కు 1500 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు. జనగామ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు 193 అయితే కొనుగోలు చేసింది 440 మెట్రిక్ టన్నులు మాత్రమే. మార్కెట్ యార్డ్ కు 4వేల మెట్రిక్ టన్నులు వచ్చింది.. అక్కడ కేవలం 1530 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు.. మద్దతు ధరకు 700 రూపాయలకు తక్కువగా వ్యాపారులు దళారులు కొంటున్నారు. రైతులతో కలిసి అధికారులను నిలదీస్తే మొదట తక్కువ ధరకు కొనడం లేదని అధికారులు బుకాయించారు. వ్యవహారం సీఎం దాకా వెళ్లినా రైతులకు అదనంగా లభించింది 30 రూపాయలు మాత్రమే.

దళారుల చేతుల్లోకి మార్కెట్లు వెళ్లిపోయాయి. సీఎం మంత్రులు రైతులను పట్టించుకోవడం లేదు. 500 రూపాయలు బోనస్ ఇచ్చి 2500 రూపాయలకు వడ్లను కొంటామని రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఎన్నో సార్లు చెప్పారు. బోనస్ మాట దేవుడెరుగు.. మద్దతు ధర కూడా రాని పరిస్థితుల్లో రేవంత్, భట్టి విక్రమార్క ఏం చేస్తున్నారు ? రైతు బంధు, రుణ మాఫీ లపై ఈ ప్రభుత్వం మోసం చేసింది కనుకే రైతులకు రేవంత్ ప్రభుత్వం పై విశ్వాసం పోయింది.. అందుకే కొనుగోలు కేంద్రాలకు కాకుండా దళారుల దగ్గరికి ధాన్యం తీసుకెళ్తున్నారు. రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి.

Read More కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న మేడ్చల్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్

ఇప్పటికే వడ్లను తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు నష్ట పోయిన మొత్తాన్ని వారి అకౌంట్లలో వేయాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో లో చెప్పినట్టు మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ చెల్లించాలి. సీఎం రేవంత్ జనగామ ఘటన పై అధికారులను ప్రశంసిస్తున్నారు ..కేవలం 30 రూపాయలు పెంచి 1560 రూపాయలకు వడ్లను కొన్నందుకు సీఎం వారిని ప్రశంసిస్తున్నారా ? సీఎం ఆదేశాల తర్వాత కూడా రైతులు 700 రూపాయలు క్వింటాల్ కు నష్టపోతున్నారని అన్నారు.

Read More తీన్మార్ మల్లన్నకు గిరిజన సంక్షేమ సంఘం మద్దతు

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి