Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..
బర్త్ డే పార్టీలో యువత డ్రగ్స్ వాడుతున్నారు...
జయభేరి, హైదరాబాద్:
నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. రాజేంద్రనగర్ SOT పోలీసులు సనత్ నగర్లో MDMA డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. 4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయితోపాటు ఓసీబీ ఫ్లేవర్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. బర్త్ డే పార్టీలో యువత డ్రగ్స్ వాడుతున్నారు...
మరోవైపు దుండిగల్ పీఎస్ పరిధిలో మేడ్చెల్ ఎస్వోటీ పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాకు చెందిన ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. రూ. 33,750 విలువైన 1.35 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయిని చేస్తుంటారు. ఒడిశాకు చెందిన కార్మికులకు రూ. 7 వేలు ఇచ్చి హైదరాబాద్లో రూ. 15 వేలకు విక్రయిస్తున్నారు. ఈ ఘటనలో రంజాన్ దాస్, కేశవ్ కౌర్, కె.గంగాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read More ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
Views: 2


