Drugs : హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..

బర్త్ డే పార్టీలో యువత డ్రగ్స్ వాడుతున్నారు...

Drugs : హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..

జయభేరి, హైదరాబాద్:
నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. రాజేంద్రనగర్ SOT పోలీసులు సనత్ నగర్‌లో MDMA డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయితోపాటు ఓసీబీ ఫ్లేవర్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బర్త్ డే పార్టీలో యువత డ్రగ్స్ వాడుతున్నారు...

నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. సనత్ నగర్ లో ఎండీఎంఏ డ్రగ్స్ పై రాజేంద్రనగర్ ఎస్ ఓటీ పోలీసులు సీజ్ చేశారు. 4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయితోపాటు ఓసీబీని స్వాధీనం చేసుకున్నారు. బర్త్ డే పార్టీలో ఆ యువకుడు డ్రగ్స్ వాడి మద్యం తాగాడు. గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు యువకులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సనత్ నగర్ పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల నుంచి ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయి, ఓసీబీ ఫ్లేవర్ డ్రగ్స్, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.

Read More మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

మరోవైపు దుండిగల్ పీఎస్ పరిధిలో మేడ్చెల్ ఎస్వోటీ పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాకు చెందిన ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. రూ. 33,750 విలువైన 1.35 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయిని చేస్తుంటారు. ఒడిశాకు చెందిన కార్మికులకు రూ. 7 వేలు ఇచ్చి హైదరాబాద్‌లో రూ. 15 వేలకు విక్రయిస్తున్నారు. ఈ ఘటనలో రంజాన్ దాస్, కేశవ్ కౌర్, కె.గంగాలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read More తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి

Views: 2

Related Posts