Congress : మల్కాజిగిరి గడ్డ.. కాంగ్రెస్ అడ్డా..!

కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరు.. ఆరోజు రేవంత్ రెడ్డికి ఇచ్చిన మెజారిటీ సునీతా మహేందర్ రెడ్డికి ఇవ్వాలి... కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల.

Congress : మల్కాజిగిరి గడ్డ.. కాంగ్రెస్ అడ్డా..!

మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతామహేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి అడ్డంకిగా ఉందన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రేవంత్‌రెడ్డికి భారీ మెజార్టీ కట్టబెట్టిన ఘనత ఇక్కడి ఓటర్లకు ఉందన్నారు. గతంలో రేవంత్ రెడ్డి మాదిరిగానే తుమ్మల సునీతా మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఉప్పల్‌లోని శ్రీరస్తు ఫంక్షన్‌ హాల్‌లో ఉప్పల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి దోముముల పరమేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అభ్యర్థి సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడారు.

sss3

Read More Election Bonds I సుప్రీం ఆదేశం.. ఎన్నికల బాండ్లు బయట పెట్టాల్సిందే..

ఎన్నికల వరకు ప్రతి నాయకుడు, కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా గుర్తు చేశారు. అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డి గెలుపే ధ్యేయంగా పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపును మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు.

Read More Telangana journalist | అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ

sss4

Read More Telangana I కాంగ్రెస్ పార్టీ ఓకే ఆశాదీపంలా కనిపిస్తోంది

మేడ్చెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగారెడ్డి హరివర్ధన్ రెడ్డి, ఉప్పల్, చెర్లపల్లి, కాప్రా కార్పొరేటర్లు మందముల రజితాపరమేశ్వర్ రెడ్డి, బొంతు శ్రీదేవి, స్వర్ణరాజ్ శివమణి, టీపీసీసీ అధ్యక్షుడు టోఫిక్, ఆగిరెడ్డి, మాజీ కార్పొరేటర్ పావనిరెడ్డి, సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, సీతారాం. రెడ్డి, రాంరెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రావణ్ రెడ్డి, ఉప్పల్ అధ్యక్షులు అకారపు అరుణ్, లింగంపల్లి రామకృష్ణ, సుర్వి మురళి గౌడ్, తావిడబోయిన గిరిబాబు, పత్తి కుమార్, చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి, ఉమేష్ గౌడ్, బజారు జగన్నాథం, తెల్కల మోహన్ రెడ్డి, అమరేశ్వరి, వెంకటేశ్వర్ రెడ్డి డివిజన్. అధ్యక్షులు రఫిక్, బాకారం లక్ష్మణ్, శ్రీకాంత్ గౌడ్, విజయ్, సింగిరెడ్డి వెంకట్ రెడ్డి, నాగశేషు, లూకాస్, గరిక సుధాకర్, అంజయ్య, ఆగం రెడ్డి, తుమ్మల దేవిరెడ్డి, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Read More Medigadda I మేడిగడ్డ.. బొందల గడ్డ... భాష మార్చుకోకపోతే ప్రజలు చీదరిస్తారు!

sss6sss5

Read More Telangana I క్యాబినెట్ భేటీతో.. బీఅర్ స్ లో పెరిగిన దడ.!?

Views: 0