మేడ్చల్ లో కీచక పోలీస్

  • న్యాయం చేస్తానని మహిళను గర్భవతిని చేసిన కానిస్టేబుల్..
  • బాధితురాలి ఫిర్యాదు కానిస్టేబుల్ రిమాండ్..

మేడ్చల్ లో కీచక పోలీస్

జయభేరి, మేడ్చల్ :
తమ సమస్య చెప్పుకునేందుకు ఓ యువతి కుటుంబతో కలిసి పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కగా సమస్యను తీర్చి వీరికి అండగా నిలవాల్సిన పోలీసులే అడ్డదారులు దొక్కుతున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన యువతిని గమనించిన ఓ కానిస్టేబుల్‌ సమస్య తీర్చి న్యాయం చేస్తానని నమ్మబలికి తనకు సన్నిహితంగా మెలిగి తన కామ కోర్చేను తీర్చుకుని చివరకు ఆమెను గర్భవతిని చేశాడు. అతంటితో ఆగకుండా గర్భం దాల్చిన యువతిపై బెదిరింపులు, దాడికి పాల్పడ్డాడు. ఓపిక నిశించడంతో భాదిత యువతి తనను మోసం చేశాడు. తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా కేసు నమోదు చేసిన పోలీసులు విషయం బయటకు పొక్కకుండా సదరు కానిస్టేబుల్‌ను రిమాండ్‌ చేశారు. 

వివరాల్లోకి వెళితే మేడ్చల్‌ పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీలో నివాసం ఉండే 31 ఏళ్ల ఓ యువతి గతేడాది మార్చి 21న డబ్బుల విషయంలో కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారనే సమస్యతో తన తల్లితో కలిసి మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ సమస్యను పోలీసులకు విన్నవించుకున్నారు. తిరిగి పోలీస్‌స్టేషన్‌ నుండి బయటకు వచ్చే సమయంలో పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌రెడ్డి వారిని చూసి తన వద్దకు పిలుచుకుని విషయం ఏంటని ఆరా తీసి మీ సమస్య పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చి తన సెల్‌ఫోన్‌ నెంబర్‌ సదరు యువతి కి ఇచ్చి ఫోన్‌ చేయాలని తెలిపాడు. మరుసటి రోజు ఫోన్‌ చేయగా న్యాయవాదికి కలిపిస్తానంటూ చెప్పారు.

Read More ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

న్యాయవాదిని కలిపిస్తానంటూ ఇంటికి పిలుచుకుని ఆఘాయిత్యం...
సమస్య పరిష్కారానికి న్యాయవాదిని కలిపిస్తానని చెప్పిన కానిస్టేబుల్‌ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో న్యాయవాది తమ ఇంటికి వస్తారని అక్కడ మాట్లాడుదాం అని చెప్పి బాధిత యువతిని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండగా ఇంట్లోవారు బయటికు వెళ్లారని చెప్పి ఇంట్లో తీసుకెళ్లి న్యాయవాది కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రవర్తించి యువతితో సన్నిహితంగా మెలిగి తనకు వివాహం కాలేదని, అమ్మానాన్నలు పెండ్లి కోసం అమ్మాయిని చూస్తున్నారు. నువ్వు నాకు నచ్చావ్, అన్ని విధాల అండగా ఉంటానంటూ మాయమాటలు చెప్పి తాను ఇదివరకే ఓ వ్యక్తి వద్ద మోసపోయి కోర్టు చుట్టూ తిరుగుతున్నానని వివాహం మీద ఆశ లేదని, తాను ఎస్సీ కులానికి చెందిన మహిళ నని మీరు అగ్రవర్ణాల వారని ఇద్దరికి కుదరదు అని తెలుపగా ఇంకా కులం ఎక్కడ ఉంది అని నాకు అలాంటి బేదం లేదని, ప్రేమిస్తున్నానంటూ బలవంతం చేసి తన శారీరక కోరిక తీర్చుకున్నాడు. 

Read More వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి

15 రోజుల అనంతరం అమ్మానాన్నలకు పరియం చేస్తానంటూ మరోమారు ఇంటికి పిలుచుకుని బలవంతంగా అనుభవించాడు. దీంతో ఇద్దరి పరిచయం ప్రేమగా మారడంతో పలుమార్లు కలుసుకోవడంతో సదరు యువతి గత ఏడాది జులై నెలలో గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్‌ సుధాకర్‌రెడ్డి పెళ్లి కాకుండా తల్లివి కావడం మంచిది కాదంటూ వెంటనే గర్భాన్ని తోలంగించాలంటూ తెలుపగా అందుకు యువతి ఒప్పుకోకపోవడంతో అబార్షన్‌ అయ్యేందుకు మాత్రలు తీసుకువచ్చి బలవంతంగా ఆమెతో వేయించడంతో అబార్షన్‌ అయ్యింది ఆగష్టు 15న ఉదయం యువతి కానిస్టేబుల్‌ సుధాకర్‌కు ఫోన్‌ చేయగా అతని భార్య ఫోన్‌ లిఫ్ట్‌ చేయడంతో ఇద్దరి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

Read More ఎమ్మెల్సీ రామచంద్రారావును సన్మానించిన మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్

అనంతరం కానిస్టేబుల్‌ పెళ్లి అయిన విషయం దాచానంటూ యువతికి తెలిపాడు. కానిస్టేబుల్‌ కుటుంబలో గొడవలు తలెత్తడంతో యువతి అడ్డు తోలగించుకునేందుకు మేడ్చల్‌లోని ఆమె ఇంటికి వెళ్లి ఫినాయిల్‌ త్రాగించాడు. అస్వస్థతకు గురై కొలుకుంది. నవంబర్‌ 23న కానిస్టేబుల్‌ అతని భార్య కోరిక మేరకు యువతిని వారి ఇంటికి తీసుకువెళ్లగా ఇద్దరు కలిసి బెదిరింపులకు పాల్పడి దాడి చేశారు. డిసెంబర్‌ 2న కానిస్టేబుల్‌ సుధాకర్‌రెడ్డి కి మిత్రుడైన మరో కానిస్టేబుల్‌ యువతితో మాట్లాడి ఇద్దరి మద్య ఉన్న గోడవను పరిష్కరిస్తానంటూ మేడ్చల్‌ పట్టణంలోని తుమ్మచెరువు వద్దకు పిలిపించుకుని ఈ విషయం ఇంతటితో వదిలేయానని, విషయం గూర్చి ఇతరులకు తెలిపినా, కేసు పెట్టినా చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. డిసెంబర్‌ 16 న బయటకు తీసుకెళ్తానని తన బండిపై తీసుకెళ్లి గిర్మాపూర్‌ సమీపంలో వేగంగా వెళ్తున్న బండిపై నుండి తోసేయడంతో యువతి గాయాలపాలైంది.

Read More అంతర్రాష్ట్ర గంజాయి విక్రెతల ముఠా అరెస్ట్... భారీగా గంజాయి స్వాధీనం

భాదితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు…
కానిస్టేబుల్‌ సుధాకర్‌రెడ్డి వ్యవహారం తెలుసుకున్న మేడ్చల్‌ ఇన్స్‌పెక్టర్‌ సత్యనారాయణ ఉన్నతాధికారులకు విషయం వివరించి జనవరి మొదటి వారంలో అతడిని సైబరాబాద్‌ కమీషనర్‌ కార్యాలయానికి బదిలీ చేయించాడు. యువతి అడ్డుతోలగించుకునేందుకు కానిస్టేబుల్‌ నిత్యం యువతి ఇంటి చుట్టూ తిరుగుతూ బెదిరింపులకు పాల్పడడంతో బాధిత యువతి ఈ నెల 3న సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్యాలయానికి వెళ్లి కానిస్టేబుల్‌ సుధాకర్‌రెడ్డి ప్రేమ పేరుతో తనను అనుభవించి మోసం చేశాడని, చంపుతానని బెదిరింపులక పాల్పడుతున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మేడ్చల్‌ పోలీసులు ఈ నెల 4న పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సుధాకర్‌రెడ్డి రిమాండ్‌కు తరలించారు. కాగా సదరు కానిస్టేబుల్‌పై గతంలోను పలు కేసులు నమోదయ్యాయి. అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో నగదు లావాదేవీల విషయంలో కేసు నమోదైనట్లు సమాచారం.

Read More మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

WhatsApp Image 2025-02-07 at 18.58.20

Read More నర్సారెడ్డి ఉన్నన్ని రోజులు గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బాగుపడదు..!