MLC : ఎవరి విద్యార్హత ఎంత?
- పట్టభద్ర ఓటర్లు ఆలోచించి విద్యావంతులకు ఓటు వేసి చట్టసభలకు పంపాలి..
- ప్రజాస్వామ్య పరిరక్షణలో బాధ్యతగా వ్యవహరించాలి..
- నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా చట్టంపై పూర్తి అవగాహన ఉన్న వారిని ఎన్నుకోవాలి
జయభేరి, హైదరాబాద్ :
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల విద్యార్హతలు... ఈ నెల 27న జరుగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
వీరిలో 12వ క్రమసంఖ్యలో ఉన్న అలయెన్స్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ పార్టీకి చెందిన ఈడా శేషగిరి రావు గౌడ్ అత్యధిక విద్యార్హతలను (M.Sc, B.Ed, LL.M, Ph.D) కలిగి ఉన్నారు. మొత్తం మీద ఐదుగురు డాక్టరేట్లు, 29 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మిగతావారు గ్రాడ్యుయేట్లు, ఇద్దరు 10వ తరగతి, ఒకరు ఐటిఐ చదివిన వారు ఉన్నారు.

Views: 0


