బ్రిడ్జి పై చెట్లని వెంటనే తొలగించాలి...

అమ్మ ఫౌండేషన్ 

బ్రిడ్జి పై చెట్లని వెంటనే తొలగించాలి...

జయభేరి జనగామ జులై 29: పట్టణంలోని నెహ్రూ పార్క్ నుండి జిల్లా హాస్పటల్ వరకు ఉన్న బ్రిడ్జ్ ఫ్లై ఓవర్ పై ఉన్న చెట్లను వెంటనే తొలగించాలి ప్రమాదకరమైన పగుళ్లు  ఫ్లై ఓవర్ పైన ఫుట్పాత్ పైన ఉన్నటువంటి పూల కుండీలను తొలగించి బాటసారిలకు ఇబ్బందికరంగా ఉండకుండా చూడాలి సమస్యలను పరిష్కరించాలి.

ఈ సందర్భంగా జనగామ అమ్మ ఫౌండేషన్ టీం ఫ్లైఓవర్ ని పరిశీలించి అక్కడున్న సమస్యలను జనగామ ఆర్ అండ్ బి జనగామ మున్సిపల్ కమిషనర్ పరిష్కరించాలని కోరిన జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణి కుమార్ ముఖ్య సలహాదారుడు వంగ భీమ్ రాజు మాట్లాడుతూ... మూడు దశాబ్దాలుగా ఫ్లైఓవర్ నిర్మించి గడుస్తున్న తరుణంలో వర్షాకాలం బ్రిడ్జ్ పై ఉన్న ప్రతి పిల్లర్ వద్ద పగుళ్లు వచ్చి అక్కడ చెట్లు పెరుగుతూ వస్తున్నాయి వాటిని వెంటనే తొలగించాలని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై ఉన్న పూల కుండీలు చాలా పెద్దవి ఉండడం వల్ల పాదాచారులు ఫుట్పాత్లో ప్రయాణం చేయలేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అండర్ బ్రిడ్జి నుంచి బ్రిడ్జి పైకి ఎక్కే క్రమంలో రెండు చోట్ల చాలా ప్రమాదకరంగా ప్లాస్టింగ్ ఊడిపోయి ఇనుప మేకులు కనిపిస్తూ ప్రమాదకరంగా ఉన్నాయి వెంటనే ప్లాస్టింగ్ చేయాలి నెహ్రూ పార్క్ నుండి జనగామ జిల్లా ఆసుపత్రి వచ్చే క్రమంలో ఫ్లైఓవర్ ఎక్కిడిగాక ఎదురుగా ఉన్న డివైడర్ వద్ద అనేక యాక్సిడెంట్లు జరిగి లారీలు బైకులు వచ్చి ప్రమాదానికి గురవుతున్నారు ప్రమాదం జరిగినప్పుడల్లా దాన్ని రిపేరు చేస్తున్నారు.

Read More tsrtc I ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్

IMG-20240729-WA1678

Read More Telangana I మేయర్, కార్పోరేటర్లంతా రాజీనామా చేసి  ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి..

కానీ అక్కడ ఎటువంటి ప్రమాదకర హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయలేకపోవడం చాలా బాధాకరం వెంటనే రేడియంతో కూడిన డివైడర్ ఉన్న విషయాన్ని తెలిసేలా బోర్డును ఏర్పాటు చేయాలి.వెంటనే ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమస్యలపై గౌరవ జనగామ మున్సిపల్ కమిషనర్ గారు మరియు చైర్మన్ గారు ఆర్ అండ్ బి అధికారులు వెంటనే స్వయంగా పరిశీలించి ఇక్కడున్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని జనగామ ప్రజల పక్షాన వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు లకన్ సింగ్. కొల్లూరు చందు. చిక్కుడు నాగేష్. పవన్.తదితరులు పాల్గొన్నారు.

Read More Telangana MP I టార్గెట్ @17

Views: 1