ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యం

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యం

జయభేరి, ఆగస్టు 26:- ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా తుంకుంట లో చోటు చేసుకుంది. దూళ్ళ మోహన్ కృష్ణ అనే యువకుడు తన బాబాయి ఇంటి వద్ద ఉంటూ తుంకుంట లోని మోర్ సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు.

కాగా ఈ నెల 21 న మధ్యాహ్న సమయంలో కొంపల్లి లోని విజేత సూపర్ మార్కెట్ కు వెళ్తున్న అని చెప్పి ఇంటి నుంచి వెళ్ళాడు. సాయంత్రం వరకు కూడ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలలో వెతికారు. అయినా మోహన్ కృష్ణ ఆచూకీ లభ్యం కాకపోవడంతో శామీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుని ఆచూకీ లభిస్తే పోలిసులకు సమాచారం అందించాలని కోరారు.

Read More యూనియన్ బ్యాంక్ మేనేజర్ పున్న సతీష్ కుమార్ కు బెస్ట్ బ్యాంకర్ అవార్డు 

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి