రసాయనాల వాడకం తగ్గించాలి

రసాయనాల వాడకం తగ్గించాలి

జయభేరి, తుర్కపల్లి, మే 20: రైతులు వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించాలని ఏవో శ్రీ ఉమా అన్నారు. మంగళవారం తుర్కపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రైతులకు అవగాహన కల్పించడానికి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్కువ యూరియాను వాడాలని, సాగునీటిని ఆదా చేయాలని, పంట మార్పిడి చేయాలని, పర్యావరణాన్ని పాడాలని ఇట్టి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ ఇందు ధర్ రెడ్డి, ప్రసన్న ఏఈఓ లు పృథ్వీరాజ్ ,రాకేష్, రైతులు ప్రభాకర్ రెడ్డి ,వాసుదేవ్ రెడ్డి, లక్ష్మీనరసయ్య, తదితరులు పాల్గొన్నారు

Read More GHMC I శివ శివ.. హర హర...

Views: 0