పాలమూరు గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది

కేంద్రంలో ఉన్న బిజెపి పాలమూరుకు ఒక్క పైసా ఇయ్యలే... 
బీఆర్ఎస్ ప్రజల్లో అపూర్వస్పందన... 
ప్రజా సంక్షేమాన్ని అందించిన కేసీఆర్ నాయకత్వానికి మద్దతు తెలపండి... ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

పాలమూరు గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే

జయభేరి, చౌదరిగూడ :

కాంగ్రెస్ బిజెపి పార్టీలు మోసపూరిత ప్రకటన చేస్తూ ప్రజలను మబ్బు పెట్టేందుకు చూస్తున్న చివరకు పాలమూరు గడ్డపై ఎగిరేది గులాబీ జెండా నేనని  బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎన్నికల ఇంచార్జ్ దూదిమెట్ల బాలరాజ్ లు ధీమా వ్యక్తం చేశారు. గురువారం షాద్ నగర్ నియోజకవర్గంలోని  కేశంపేట, కొత్తపేట, మొగిలిగిద్ద, కొందుర్గ్, చౌదరిగూడ గ్రామాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. అమలకు సాధ్యం కాని హామీలను ఇచ్చి, ప్రజలను మభ్య పెట్టి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరని అన్నారు.

Read More సెల్లార్ లో కూలిన మట్టిదిబ్బలు

brs111b

Read More ఎమ్మెల్సీ రామచంద్రారావును సన్మానించిన మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్

ప్రభుత్వ పాలనపై పట్టు లేని సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసిఆర్ ఫై అర్థం లేని ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారే తప్పా, ప్రజా సంక్షేమంపై దృష్టి లేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్న రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని, ఒక్క ఉద్యోగ ప్రకటన కూడా చేయలేదని, ఇచ్చిన హామీలను నేరవేర్చలేదని ఆరోపించారు. పాలమూరు అభివృద్ధి కి ఒక్క పైసా కుడా ఇవ్వని బీజేపీ కి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు.

Read More 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు

అబద్దాలను ప్రచారం చేస్తూ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లు గెలుపొండాలని చూస్తున్నాయని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు సంపూర్ణ సంక్షేమాని అందించిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కింది చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కరువు తప్ప, అభివృద్ధి లేదని, రైతులను పట్టించుకున్నా పాపన పోలేదని వాపోయారు. ప్రజలు ప్రస్తుత పరిస్థితితులను గమనించి ఓటు వేయాలని కోరారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలిచే బీఆర్ఎస్ కు మద్దతు తెలిపి కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం లో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని, కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి ప్రజల మద్దతు ఊహించని స్థాయిలో రావడం సంతోషకరమని అన్నారు.

Read More యూనియన్ బ్యాంక్ మేనేజర్ పున్న సతీష్ కుమార్ కు బెస్ట్ బ్యాంకర్ అవార్డు