రాష్ట్రంలో ఈదురుగాలుల బీభత్సం ఏడుగురి మృతి
జయభేరి :
తెలంగాణ రాష్ట్రంలో ఈదురుగాలుల బీభత్సానికి ఏడుగురు మరణించారు.
నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్లో కోళ్ల ఫారం గోడ కూలి నలుగురు కార్మికులు మరణించారు. అదే జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగుపాటుకు లక్ష్మణ్(12) చనిపోయారు.
మేడ్చల్ జిల్లా శామీర్పేట సమీపంలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి బైక్ మీద పడటంతో నాగిరెడ్డి, రామ్ రెడ్డి మరణించారు.
Views: 1


