Nalgonda Police I డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసుల (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) కవాతు
కేంద్ర బలగాల డిఎస్పి బెటాలియన్ ఇన్చార్జి భాటియా ఆధ్వర్యంలో పోలీసుల కవాతు కార్యక్రమం నిర్వహించారు.
జయభేరి, దేవరకొండ :

రాజకీయ పార్టీల నేతలు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎన్నికలు నిర్వహించడం తమ కర్తవ్యమని అన్నారు.ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని, చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించినా వారిపై చట్ట ప్రకారము చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజల అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది 54 మంది తో పాటు దేవరకొండ సీఐ నరసింహులు, డిండి సీఐ సురేష్ బాబు , దేవరకొండ ఎస్సై రమేష్, నేరేడుగుమ్ము ఎస్సై సతీష్, 15 మంది సివిల్ కానిస్టేబుల్స్, సివిల్ ఫోర్స్ తదితరులు పాల్గొన్నారు.
Read More Health I ప్రజా ఆరోగ్యం మెరుగుపడేదెలా!?
Views: 0


