ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ!

ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ!

హైదరాబాద్, డిసెంబర్ 02 : ములుగు జిల్లా చల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టు లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. 

ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలంలో రెండు ఏకే-47 రైఫిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read More మహిళ ఆశా వర్కర్స్ డే 

కాగా.. ఈ ఎన్‌కౌంటర్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌం టర్ పై పలు అనుమానాలు ఉన్నాయని..అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజలు వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. 

Read More BJYM ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు

చనిపోయిన ఏడుగురి మావోయిస్టు మృతదే హాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్షలు నిర్వహించాలని.. పోస్టుమార్టం సమయంలో వీడియో రికార్డు చేయాలని, పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు అయింది, ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Read More సీసీ కెమెరాల ఏర్పాటుకు హెచ్ బి ఎల్  పరిశ్రమ సహకారం