ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు
జయభేరి, కోదాడ : భారతదేశం సర్వ మతాల సమ్మేళనం, మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని ఉత్తమ్ పద్మావతి రెడ్డి నియోజకవర్గ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు తోగటి యాదాద్రి అన్నారు.
రంజాన్ పండుగకు ప్రధాన కారణం ముస్లింల పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ ఈ నెలలోనే ఆవిర్భవించిందన్నారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది అన్నారు. ఈ మాసంలో ముస్లింలు పవిత్రంగా నిష్టగా ఓపికతో ఉండి ఉపవాస దీక్షలు చేస్తారని చెప్పారు.
ఈ రంజాన్ మాసంలో నియోజకవర్గ పరిధిలో ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందును అందించడం ద్వారా అది మత సా సామరస్యానికి ప్రతీకగా సమాజానికి చాటి చెప్పడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బుర్ర పుల్లారెడ్డి, డేగ కొండయ్య, బాబు నాయక్, గుర్రం వెంకటరెడ్డి, ముత్తినేని కోటేశ్వరరావు, ఉపవాస దీక్షకులు పాల్గొన్నారు.
Post Comment