MLC Kavitha I కవిత నేడు కోర్టుకు.. ఈడీ కస్టడీ పొడిగించే ఛాన్స్..!
మరోవైపు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఈరోజుతో ముగియనుంది.
ప్రముఖుల అరెస్టులతో దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు రోజురోజుకు మలుపు తిరుగుతోంది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ కస్టడీలోకి తీసుకునేందుకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. మరోవైపు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది.
ఇదిలా ఉంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నందున కవిత, ఆయన్ను కలిసి విచారించే అవకాశాలున్నాయని, అందుకే ఈడీ మరో ఐదు రోజుల కస్టడీని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 15న కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. మార్చి 16న ఆమెను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా.. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కవిత వారం రోజులుగా ఢిల్లీ ఈడీ కస్టడీలో ఉన్నారు. నేటితో ఈడీ కస్టడీ ముగియనుండడంతో ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. ఈడీ కస్టడీ కోరకుంటే జడ్జి అతడిని జ్యుడీషియల్ రిమాండ్కు పంపిస్తారా.. లేక బెయిల్ మంజూరు చేస్తారా అనేది సాయంత్రంలోగా తేలనుంది.
మరోవైపు కవిత కేసులో ఈడీ ఏకపక్షంగా, నియంతృత్వంగా వ్యవహరిస్తోందని కవిత తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే కవితను అరెస్ట్ చేశామని ఈడీ చెబుతోంది. మరి కవిత విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Post Comment