సీసీ కెమెరాల ఏర్పాటుకు హెచ్ బి ఎల్  పరిశ్రమ సహకారం

సీసీ కెమెరాల ఏర్పాటుకు హెచ్ బి ఎల్  పరిశ్రమ సహకారం

జయభేరి, డిసెంబర్ 4:
మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం అలియాబాద్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు గత కొన్ని రోజులుగా పనిచేయడం లేదు. దీంతో గ్రామంలో రాత్రి వేళల్లో    నేరాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్న ఆందోళనతో గ్రామానికి చెందిన నాయకులు గాదే వెంకటేష్, గురక కుమార్ యాదవ్, గోలిపల్లి ప్రభాకర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, కంచికట్ల గోపాల్, గౌరారం శ్రీకాంత్, సత్యనారాయణ కలిసి స్థానికంగా ఉన్న ఎచ్ బి ల్ పరిశ్రమ యాజమాన్యంతో కలిసి మాట్లాడి సీసీ కెమెరాలకు గానూ 65000 రూపాయలు ఇప్పించారు. ఈ సందర్భంగా వారు హెచ్ బి ఎల్ పరిశ్రమ యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Latest News