Food : ఆహార పదార్థాలలో కల్తీని అరికట్టాలి

దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డా. పల్లె పాడు దామోదర్    

అధ్యక్షుడు డా. పల్లె పాడు దామోదర్ గురువారం ఉదయం హైదరాబాద్ కోటిలో రాష్ట్ర ఆహార కల్తీ నిరోధక శాఖ కార్యాలయంలో డిప్యూటీ కంట్రోలర్ విజయ కుమార్ కలిసి, ఆహార కల్తీ నిరోధానికి సంబంధించిన వినతిపత్రం సమర్పించారు.

Food : ఆహార పదార్థాలలో కల్తీని అరికట్టాలి

జయభేరి, బ్యూరో చీఫ్ వరంగల్ మే 22                              
ఆహార పదార్థాలలో కల్తీని అరికట్టాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డా. పల్లె పాడు దామోదర్ అన్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ కోటిలో రాష్ట్ర ఆహార కల్తీ నిరోధక శాఖ కార్యాలయంలో డిప్యూటీ కంట్రోలర్ విజయ కుమార్ కలిసి, ఆహార కల్తీ నిరోధానికి సంబంధించిన వినతిపత్రం సమర్పించారు.

తెలంగా ణా రాష్ట్రంలో హైదరాబాద్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం ఆహార కల్తీ సమస్యలు నిరంతరం కొనసా గుతూనే ఉన్నాయని, ప్రతీ చోట టాస్క్ఫోర్స్ దాడుల్లో భయంకర ఆహార కల్తీ సంఘటనలు వెలుగులోకి వస్తున్న క్రమంలో ఆహార కల్తీ నిరోధానికి వినియోగదారుల సంఘాలతో కలిసి జిల్లా స్థాయిల్లో ప్రత్యేక నిఘా విభాగాలు ఏర్పాటు చేయాలని డా. పల్లెపాడు దామోదర్ పాటు సి.సి.ఐ. జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, క్యాట్కో ఛైర్మన్ శంకర్ లాల్ చౌరాసియా లు డిప్యూటీ కంట్రోలర్ విజయ కుమార్ ను కోరారు.

Read More Telangana I ఇది గౌడలను అవమానించడమే..!

a781b21f-1a1d-4d8f-9da7-64f35d0d33b7

Read More Telangana I జంప్ జిలానీల తో ఎల్బీనగర్ తికమక

24 గంటల వరకే నాణ్యతగా ఉండే పాలను, రెండు లేదా మూడు రోజులు వరకు పాలు నాణ్యతగా ఉండటానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనాలు కలపడం సర్వసా ధారణమైపోయిందని, పసుపు లో లెడ్ క్రోమేట్ కలప డం వల్ల క్యాన్సర్ వ్యాధులు విజృంభిస్తున్నాయని కాబట్టి వినియోగదారుల్లో ఆహార కల్తీ పట్ల చైతన్యం కూడా నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉందని వినియోగదారుల ప్రతినిధులు విన్నవించారు హైదరాబాద్ హోటల్స్ కల్తీ అరికట్టే భాద్యత ఉన్న ముని సిపల్ కార్పొరేషన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ లను అప్రమత్తం చేయాలని, డిప్యూటీ కంట్రోలర్ ను కోరడం జరిగింది.

Read More SBI | రమేష్ మృతి తీరని లోటు   

Views: 0

Related Posts