భారతదేశ చరిత్రలోనే చరిత్ర ఆత్మక ఘట్టం రైతు రుణమాఫీ..
సూర్యాపేటలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కామెంట్స్
జయభేరి :
అన్నదాతలకు అండగా ఉండడం కోసం ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 31 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే పాలాభిషేకం చాలా చిన్నది అని చెప్పిన దామన్న మాటను స్వాగతిస్తున్నాం. 40 లక్షల మంది రైతులకు కన్నా కొడుకు సీఎం రేవంత్ రెడ్డి.. గత ప్రభుత్వం పెట్రోల్ బంకులకు ఔటర్ రింగ్ రోడ్లకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతుబంధు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. 18 వేల కోట్ల రూపాయలు ఖాళీ భూములకు పడవబడ్డ భూములకు రైతుబంధు ఇచ్చుకుంటూ వచ్చిండు రైతులకు ఇచ్చింది ఏమీ లేదు. జగదీష్ రెడ్డి కోటి ఎకరాల మగానికి నీళ్లు పంపుతున్నాం అంటున్నారు కోటి ఎకరాలకు నీళ్లు పంపితే కరెంటుతోనే ఏం పని??
విద్యుత్ సంస్థలను 80 వేల కోట్ల రూపాయలు అప్పులపాలు చేసిన ఘనత మంత్రి జగదీష్ రెడ్డి. సింగరేణి కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెట్టే వరకు 3500 కోట్ల రూపాయల బడ్జెట్ తో పాటు ఇస్తే సింగరేణి కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే మోడీ వచ్చి ఇవ్వాల్సిందే... కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కటి సరి చేసుకుంటూ వచ్చి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది
జగదీశ్ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని మాయమాటలు చెప్పినా రేపు కేసీఆర్ తోక పట్టుకొని జైలుకు పోవాల్సిందే... కరెంటు కుంభకోణంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఇండియా ఫూల్ లో చేసిన అక్రమ ఒప్పందంలో నువ్వు జైలుకు పోవడం తప్పదు. సూర్యాపేట ప్రజలారా మీకు దామన్న అండ ఉంది ఇక్కడ పేద ప్రజలను మోసం చేశారు ఆ లెక్కలన్నీ బయటకు తీయండి వాళ్ళని బొక్కలో వేయించి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పేద ప్రజలకు అండగా ఉంటది.
మా సర్వోత్తమ్ రెడ్డి అన్నను నాతోపాటు చట్టసభల్లోకి తీసుకుపోయే బాధ్యత నాపై ఉంది. సూర్యాపేటకు ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి దామోదర్ రెడ్డి నియోజకవర్గ ప్రజల మీద దామన్నకు చాలా ప్రేమ ఉంది సూర్యాపేట ఎమ్మెల్యేగా దామన్న తప్ప ఎవరు ని ఊహించుకోవాల్సిన అవసరం లేదు ఆయనే ఎమ్మెల్యే.. కాలేశ్వరం నీళ్లు కరీంనగర్ దాటలేదు కోటి ఎకరాల మగానికి చేశామని చెబుతున్న జగదీశ్ రెడ్డి మరి కరెంటు కోతలకు 80 వేల కోట్ల నష్టానికి తీసుకుపోయిన వ్యక్తి జగదీశ్ రెడ్డి కాదా??
దామన్న చేసిన సేవ కష్టం తుంగతుర్తి లో ప్రతి గడప గుర్తు చేస్తాయి సూర్యాపేటలో ప్రతి బిడ్డ చెప్తది దామన్న ఏ పదవిలో ఉన్న ఎక్కడ ఉన్న మేము మీ సోదరులం. ఈ వివరాలన్నీ గ్రామస్థాయిలో ప్రజలకు చెప్పవలసిన అవసరం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిపించి దామన్నను గౌరవించవలసిన అవసరం ఉన్నది.


