ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎన్నిక 

ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎన్నిక 

జయభేరి, గజ్వేల్, డిసెంబర్ 04 :
గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో  ప్రజా పాలన సంబరాలు కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, గజ్వేల్ కోఆర్డినేటర్ పారిజాత, నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞాపూర్ నాలుగో వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులుగా ఈదుగాని శివులు శిర్ల కృష్ణ కొల్లూరి సత్యనారాయణ సోం నాగరాణి దామర్ కుంట సుష్మ  నియామకమయ్యారు.

ఈ సందర్భంగా ఈదు గాని శివులు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ఇందిరమ్మ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని వారికి కేటాయించిన పదవులకు న్యాయం చేస్తాం నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉంటాం నర్సారెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలు కుల మత పార్టీలకతీతంగా అర్హులైన వారికి అందే విధంగా కృషి చేస్తామన్నారు.

Read More జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో విఙ్ఞాన భారతి పాఠశాల విద్యార్థుల ప్రతిభ

అంతేకాకుండా గత పది సంవత్సరాలలో ఏ ఒక్కరికి కూడా ఇల్లు లేని వారికి ఏ ఒక్క రూపాయి కూడా సహాయం చేయని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అవహేళన చేస్తూ ప్రజలకు అందకుండా అడ్డుపడుతున్నారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి తపనంత రాబోయే స్థానిక సంస్థల్లో నాలుగు ఓట్ల కోసం నానా ఆగమ చేస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి  ప్రవేశపెట్టిన పథకాలు నర్సా రెడ్డి ఆదేశాల మేరకు నర్సారెడ్డి ఆధ్వర్యంలో ప్రజలందరికీ అందేవిధంగా పనిచేస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం అని తెలిపారు.

Read More రైతుబంధును బంజేసే కుట్ర: హరీశ్ రావు..!!

Latest News