రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవ ఎన్నిక
హైదరాబాద్, ఆగస్టు 27 : తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, ఇండిపెండెంట్గా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు.
2001 నుంచి కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి గా పనిచేస్తున్నారు. రెండు దఫాలు (2006, 2018)గా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ప్రదేశ్ నుంచి పోటీచేసి భాజపా చేతిలో ఓడిపోయారు.
తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యత్వం కోసం స్థానిక నాయకులు కొందరు ప్రయత్నించినా… జాతీయ రాజకీయాల్లో సింఘ్వీ సేవ లు కాంగ్రెస్కు కీలకమైనం దున ఆయనకే అధిష్ఠానం అవకాశం కల్పించింది.
Read More Telangana I చెత్త మనుషులు
Views: 0


