కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఎ వైరస్
12మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడి
ఈ రాష్ట్రంలో 1,977 కేసులు ఏడాది మొదటి నాలుగున్నర నెలల్లో బయటపడ్డాయి. ఈ క్రమంలో అత్యధిక కేసులు నమోదైన కోజికోడ్, మలప్పురం, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాలకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ హెచ్చరికలు జారీ చేశారు. వైరస్ కట్టడికి ఈ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారును ఆదేశించారు.
జయభేరి, తిరువనంతపురం, మే 16:
కేరళలో లో హెపటైటిస్ ఎ వైరస్ విజృంభిస్తుంది. అత్యంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. 12మంది ఈ వైరస్ కారణంగా ఇప్పటికే మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ రాష్ట్రంలో 1,977 కేసులు ఏడాది మొదటి నాలుగున్నర నెలల్లో బయటపడ్డాయి. ఈ క్రమంలో అత్యధిక కేసులు నమోదైన కోజికోడ్, మలప్పురం, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాలకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ హెచ్చరికలు జారీ చేశారు. వైరస్ కట్టడికి ఈ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారును ఆదేశించారు.


