కుంట్లూర్ గ్రామంలో విషాదం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి
- డీసీఎం వాహనాన్ని ఢీకొన్న కారు
- హయత్ నగర్ - కుంట్లూర్ రోడ్డులో ఘటన
జయభేరి, హయత్ నగర్ : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరులో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్ నగర్ సీఐ నాగరాజుగౌడ్ తెలిపిన వివరాలు.. కుంట్లూర్ గ్రామంలోని నారాయణ కాలేజీ (బాసర క్యాంపస్) సమీపంలో.. పసుమాముల గ్రామం వైపు నుంచి కుంట్లూరు వైపు స్కోడా కారు వస్తున్నది.. అదే సమయంలో కుంట్లూరు నుంచి పసుమాముల వైపు డీసీఎం వ్యాన్ వస్తుండగా మూల మలుపు వద్ద అతివేగంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఫంక్షన్ కు వెళ్లి.. తిరిగి వస్తుండగా ప్రమాదం : కుంట్లూరు గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు మంగళవారం రాత్రి పెద్ద అంబర్ పేటలో ఓ ఫంక్షన్ కు వెళ్లారు. రాత్రి నాంపల్లి లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో బస చేశారు. స్వగ్రామం కుంట్లూరు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. 2 నిమిషాలైతే ఎవరి ఇండ్లకు వారు చేరేవారని, అంతలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని స్థానికుల వాపోయారు.
Post Comment