జగ్గయ్యపేట ఆల్ట్రాటెక్ లో ఘోర ప్రమాదం పదిమందికి తీవ్ర గాయాలు?
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామ సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ లో ఘోర ప్రమాదం కలవరం సృష్టించింది. సిమ్మెంటు ఉత్పత్తిలో కీలకమైన కింక్లర్ పేలటంతో... వేడి వేడి సిమ్మెంటు ఎగసి పడి.. విధుల్లోని కార్మికులు హాహాకారాలు చేశారు.
గాయపడిన కార్మికులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేశారు. జగ్గయ్యపేట ఆసుప్రతికి ఒక కార్మికుడిని చేర్చగా... మరో నలుగురిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు, మరికొంత మంది క్షతగాత్రులను కోదాడ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
Views: 0


