జగ్గయ్యపేట ఆల్ట్రాటెక్ లో ఘోర ప్రమాదం పదిమందికి తీవ్ర గాయాలు? 

జగ్గయ్యపేట ఆల్ట్రాటెక్ లో ఘోర ప్రమాదం పదిమందికి తీవ్ర గాయాలు? 

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం  బూదవాడ గ్రామ సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ లో ఘోర ప్రమాదం కలవరం సృష్టించింది. సిమ్మెంటు ఉత్పత్తిలో కీలకమైన కింక్లర్ పేలటంతో... వేడి వేడి సిమ్మెంటు ఎగసి పడి.. విధుల్లోని కార్మికులు హాహాకారాలు చేశారు.

పదిమంది కార్మికుల శరీరం కాలిపోయింది. ఈ ఘటనతో బూదవాడ ప్రజలు కంగారెత్తిపోయారు. గ్రామస్తుల దాడి జరుగుతుందనే భయాందోళనతో యాజమాన్యం మెయిన్ గేట్లు మూసివేసినట్టు తెలిసింది.  వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గయ్యపేట, కోదాడ మధ్యన ఆల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆదివారం అకస్మాత్తుగా 11.45 గంటలకు స్రమాదం సంభవించింది. వేడి వేడి సిమ్మెంట్ మీద పడి శరీరం కాలిపోవటంతో... కర్మాగారంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

Read More సీఎం జగన్‌పై రాయి విసిరిన వ్యక్తి.. ఎడమ కన్ను పైభాగంలో గాయం

గాయపడిన కార్మికులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేశారు. జగ్గయ్యపేట ఆసుప్రతికి ఒక కార్మికుడిని చేర్చగా... మరో నలుగురిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు, మరికొంత మంది క్షతగాత్రులను కోదాడ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.

Read More జగన్‌పై దాడి కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఈసీ ఆదేశం

Views: 0

Related Posts