నలుగురు ఐఏఎస్ల పదవీ విరమణ
మాజీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డితో పాటు పూనం మాలకొండయ్య, కె.వెంకటరమణారెడ్డి, హెచ్.అరుణ్కుమార్ రిటైరయ్యారు.
జయభేరి, అమరావతి:
సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా పదవీ విరమణ నేపథ్యంలో జవహర్ రెడ్డి, పూనంకు ప్రభుత్వం గురువారం పోస్టింగ్లు ఇచ్చింది. ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ తీసుకున్న జవహర్రెడ్డి రిటైర్ కావడంతో ఇన్చార్జిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాముకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న పూనం మాలకొండయ్య స్థానంలో పోలా భాస్కర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సివిల్ సప్లయ్స్ కమిషనర్గా ఉన్న హెచ్.అరుణ్కుమార్ను ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు.
Views: 0


