తుంకుంట మున్సిపల్ పరిధిలో వన మహోత్సవం
పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మొక్కలు నాటాలని పిలుపు
జయభేరి, జులై 16: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తుంకుంట మున్సిపల్ కమిషనర్ ఆర్. వెంకట గోపాల్, మున్సిపల్ చైర్మన్ కారంగుల రాజేశ్వర్ రావు లు తెలిపారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా తుంకుంట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు పోతాయిపల్లి లోని ప్రభుత్వ పార్కులో మొక్కలు నాటారు.
Read More Telangana I పరీక్షకే..పరీక్ష...
నేటి నుంచి ప్రతీ రోజు మున్సిపల్ పరిధిలోని 16 వార్డులలో వన మహోత్సవం కార్యక్రమం చేపడతామని, ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనీ మొక్కలు నాటాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ తీగుళ్ల హరిబాబు, 11 వ వార్డు కౌన్సిలర్ నర్సింగరావు గౌడ్, కో ఆప్షన్ సభ్యులు మిర్జా షఫీ, ఉల్లా భేగ్, మున్సిపల్ మేనేజర్ శ్రవణ్ కుమార్. బిల్ కలెక్టర్లు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read More Telangana I కంచర గాడిద.. రేసుగుర్రం... సన్నాసి! దద్దమ్మలు! దున్నపోతును కొనుక్కున్నది ఎవరు?

Views: 0


