అధికారిగా సమాజంలో చేసిన సేవలు చిరస్మరణీయం
గుండ్లపోచంపల్లి కమిషనర్ రాములు పదవీ విరమణ కార్యక్రమంలో ఎంపీ ఈటల
జయభేరి, మేడ్చల్ :
పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి తప్పనిసరని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. శనివారం గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వేముల రాములు పదవి విరమణ అభినందన సభలో ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరై కమిషనర్ రాములు దంపతులను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు రజిత వెంకటేష్, అమరం జైపాల్ రెడ్డి, మల్లికార్జున్, హేమంత్ రెడ్డి, బాలరాజు, పెంటయ్య, హంసా రాణి, సరస్వతి, వీణ, సాయిపేట శ్రీనివాస్, రాజకుమారి, అంథోనమ్మ, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, భేరి ఈశ్వర్, బిజెపి జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


