అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి:- విక్రమ్ రెడ్డి

గుండ్లపోచంపల్లిలో మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి:- విక్రమ్ రెడ్డి

మేడ్చల్ : పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కట్టుబడి ఉండాలని మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పట్లోళ్ళ విక్రమ్ రెడ్డి అన్నారు.  

మన్ కీ బాత్ లో ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ అమ్మ పేరుతో ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పట్లోళ్ళ విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ అందరూ విరివిగా మొక్కలు నాటడం ద్వారా తల్లిలాంటి ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతామన్నారు. ప్రకృతి కన్నతల్లి లాంటిదని దానిని కాపాడుకోవడం సామాజిక బాధ్యతని చెప్పారు.

Read More వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి

పర్యావరణాన్ని రక్షించుకుంటేనే భావితరాలకు మనుగడ ఉంటుందని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, అమరం సరస్వతి, సీనియర్ నేతలు కృష్ణగౌడ్, రవీందర్ గౌడ్, కిషన్, అశోక్, ఆంజనేయులు, సురేష్, కృష్ణా, నవనిత, శ్రీధర్, మహేష్, నాగరాజు, ముక్కిడిగాళ్ళ మహేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Read More మాదిగలకు 9 శాతం రిజర్వేషన్ పై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

Views: 0